త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tollywood | టాలీవుడ్‌లో విషాదం – సినీ ఎడిట‌ర్ క‌న్నుమూత‌

తెలుగు సినీ ఎడిట‌ర్ మ‌ధురెడ్డి శ‌నివారం గుండెపోటుతో క‌న్నుమూశారు. క‌రీంన‌గ‌ర్ జిల్లాకు చెందిన మ‌ధురెడ్డి ద‌ళం, ద‌క్ష‌, అహ నా పెళ్లంట‌తో పాటు ప‌లు సినిమాల‌కు ఎడిట‌ర్‌గా ప‌నిచేశాడు.

N

Entertainment | Published On Apr 19, 2026, 6.58 pm IST

Tollywood | టాలీవుడ్‌లో విషాదం – సినీ ఎడిట‌ర్ క‌న్నుమూత‌
Advertisement

Tollywood | తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. సినీ ఎడిటర్ మధు రెడ్డి హైదరాబాద్‌లోని మ‌ణికొండ‌లో ఏప్రిల్ 18న గుండెపోటుతో కన్నుమూశారు. క‌రీంన‌గ‌ర్ జిల్లాకు చెందిన మధు రెడ్డి ఎడిట‌ర్‌గా టాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్నారు. 'దళం', 'దక్ష', 'అహ నా పెళ్ళంట', 'జగమేమాయ', 'వాలెంటైన్స్ నైట్' వంటి చిత్రాల‌తో ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు. మ‌ధు రెడ్డి ఎడిట‌ర్‌గా వ్యవహరించిన అగ్ని న‌క్ష‌త్రం మూవీ త్వ‌ర‌లో రిలీజ్ కాబోతుంది.

కేవలం సినిమాల‌కు మాత్ర‌మే కాకుండా.. వంద‌లాది సినిమా ట్రైల‌ర్‌ల‌కు ఎడిటర్‌గా కూడా పనిచేశారు. 'జగడం', 'జల్సా' లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల ట్రైలర్స్ కట్ చేసింది మ‌ధురెడ్డినే. ఆ ట్రైలర్స్ ద్వారా సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచడంలో ఆయన ఎడిటింగ్ మార్క్ చాలా ఉంది. మధు రెడ్డి ఆకస్మిక మరణం ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సంతాపం వ్య‌క్తం చేశారు.

 

Advertisement
Advertisement