త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tollywood | జేడీ చ‌క్ర‌వ‌ర్తి మిస్ చేసుకున్న సినిమాతో సోలో హీరోగా ర‌వితేజ‌కు ఫ‌స్ట్ హిట్‌

మాస్ మ‌హారాజా ర‌వితేజ కెరీర్‌కు ట‌ర్నింగ్ పాయింట్‌గా నిలిచిన సినిమాల్లో ఇట్లు శ్రావ‌ణి సుబ్ర‌మ‌ణ్యం ఒక‌టి. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ ల‌వ్‌స్టోరీ బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. ఈ సినిమాలో హీరోగా ర‌వితేజ ఫ‌స్ట్ ఛాయిస్ కాద‌ట‌.

N

Entertainment | Published On Apr 25, 2026, 8.17 pm IST

Tollywood | జేడీ చ‌క్ర‌వ‌ర్తి మిస్ చేసుకున్న సినిమాతో  సోలో హీరోగా ర‌వితేజ‌కు ఫ‌స్ట్ హిట్‌
Advertisement

Tollywood |  మాస్ మ‌హారాజా కెరీర్‌ను మ‌లుపుతిప్పిన సినిమాల్లో ఇట్లు శ్రావ‌ణి సుబ్ర‌మ‌ణ్యం ఒక‌టి. విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా చిన్న చిన్న రోల్స్ చేస్తోన్న ర‌వితేజ సోలో హీరోగా ఈ సినిమాతోనే ఫ‌స్ట్ హిట్‌ను అందుకున్నాడు. స్టార్ హీరోగా ర‌వితేజ మార‌డానికి తొలి అడుగుగా ఈ సినిమానే నిలిచింది. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ఎలాంటి అంచ‌నాలు లేకుండా చిన్న సినిమాగా రిలీజైన ఇట్లు శ్రావ‌ణి సుబ్ర‌మ‌ణ్యం బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. ర‌వితేజ‌, పూరి జ‌గ‌న్నాథ్, మ్యూజిక్ డైరెక్ట‌ర్ చ‌క్రితో పాటు చాలా మంది జీవితాల‌కు ఓ ట‌ర్నింగ్ పాయింట్‌గా మారింది. ఈ సినిమాలోని పాట‌లు అప్ప‌ట్లో ట్రెండ్‌సెట్ట‌ర్‌గా నిలిచాయి.

గాయ‌ప‌డ్డ సింహం...

అయితే ఇట్లు శ్రావ‌ణి సుబ్ర‌మ‌ణ్యంలో హీరోగా ఫ‌స్ట్ ఛాయిస్ ర‌వితేజ కాద‌ట‌. ఈ ల‌వ్‌స్టోరీని జేడీ చ‌క్ర‌వ‌ర్తితో చేయాల‌ని నిర్మాత‌లు అనుకున్నార‌ట‌. ఈ విష‌యాన్ని గాయ‌ప‌డ్డ సింహం ప్ర‌మోష‌న్స్‌లో జేడీ చ‌క్ర‌వ‌ర్తి బ‌య‌ట‌పెట్టాడు.

అలా మిస్స‌య్యింది...

నిర్మాత‌లు శేషురెడ్డి, వేణుగోపాల్ రెడ్డి నాకు క్లోజ్ ఫ్రెండ్స్‌. న‌న్ను హీరోగా పెట్టి ఇట్లు శ్రావ‌ణి సుబ్ర‌మ‌ణ్యం తీయాల‌ని అనుకున్నారు. ఆ టైమ్‌లో నాకున్న క‌మిట్‌మెంట్స్ కార‌ణంగా ముంబాయి వెళ్లాల్సివ‌చ్చింది. దాంతో సినిమా మిస్స‌య్యింది అని జేడీ చ‌క్ర‌వ‌ర్తి అన్నారు.

సేతు రీమేక్‌లో...

విక్ర‌మ్ సేతు తెలుగు రీమేక్‌లో కూడా తానే న‌టించాల్సింద‌ని పూరి జ‌గ‌న్నాథ్ చెప్పారు. స్టోరీ రెడీ అయిన త‌ర్వాత ఆ ఆఫ‌ర్‌ను వ‌దులుకోవాల్సివ‌చ్చింద‌ని చెప్పాడు. ఆ త‌ర్వాత సేతు సినిమాను తెలుగులో రాజ‌శేఖ‌ర్ శేషు పేరుతో రీమేక్ చేశార‌ని అన్నాడు.
గాయ‌ప‌డ్డ సింహం మూవీతో కొంత గ్యాప్ త‌ర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు జేడీ చ‌క్ర‌వ‌ర్తి. త‌రుణ్ భాస్క‌ర్ హీరోగా న‌టించిన ఈ సినిమాలో ధ‌ర్మా అనే క్యారెక్ట‌ర్‌లో జేడీ చ‌క్ర‌వ‌ర్తి క‌నిపించ‌బోతున్నారు. క‌శ్య‌ప్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా మే 1న రిలీజ్ కాబోతుంది.

 

Advertisement
Advertisement