లోడ్ అవుతోంది...


Actress Roja | దాదాపు పదమూడేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత సీనియర్ హీరోయిన్ రోజా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. తమిళంలో రెండు మూవీస్ను అంగీకరించారు. ప్రస్తుతం ఈ తమిళ సినిమాల షూటింగ్లతో బిజీగా ఉన్నారు రోజా. పాలిటిక్స్కు రోజా గుడ్బై చెప్పబోతున్నారని, అందుకే మళ్లీ సినిమాల్లో నటిస్తున్నారంటూ రోజాను కొందరు ట్రోల్ చేస్తున్నారు. డబ్బుల కోసమే రోజా యాక్టర్గా మారిందంటూ నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారు. ఈ ట్రోల్స్పై ఓ ఇంటర్వ్యూలో రోజా రియాక్ట్ అయ్యింది. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమో రిలీజైంది. ఈ ప్రోమోలో "చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తే తప్పులేదు. నేను సినిమాల్లో నటిస్తే అదొక పెద్ద తప్పులా కొందరు క్రియేట్ చేస్తున్నారంటూ "ఆగ్రహం వ్యక్తం చేసింది. పవన్ కళ్యాణ్ తన తల రాతనే ఆయన రాసుకోలేడని , అదీ కూడా చంద్రబాబు నాయుడు రాయాలి అంటూ డిప్యూటీ సీఏంపై విమర్శలు కురిపించింది రోజా.
తమిళంలో లెనిన్ పాండియన్తో పాటు ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీకి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. లెనిన్ పాండియన్లో శివాజీ గణేషన్ మనవడు దర్శన్ గణేషన్ హీరోగా నటిస్తున్నారు. ఇందులో సంతానం అనే డీ గ్లామర్ పాత్రలో రోజా కనిపించబోతున్నది. పరి ఎలవజగన్ హీరోగా నటిస్తున్న మరో సినిమాలో రోజా డిఫరెంట్ క్యారెక్టర్ చేయబోతున్నది. ఈ రెండు సినిమాలు ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. చివరగా 2015లో రిలీజైన ఎన్ వజి తాన్ వజి అనే సినిమా చేసింది. ఆ తర్వాత పదేళ్ల పాటు సినిమాలకు దూరమైంది. తెలుగులో చివరగా 2013లో వచ్చిన డాటర్ ఆఫ్ వర్మ సినిమాలో కనిపించింది. టాలీవుడ్లో ఒకప్పుడు అగ్ర హీరోయిన్గా కొనసాగిన రోజా చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి హీరోలతో సినిమాలు చేసింది. పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చిన రోజా ఏపీ మంత్రిగా పనిచేశారు.





Developed & Published by TRINETHRA MEDIA HOUSE PVT. LTD,
Sai Madhu Towers, Plot No. 17, Rohini Layout Rd, Jaihind Enclave, Madhapur, Hyderabad, Telangana 500081.
Copyright © 2025 . All rights reserved. - Powered by : Veegam