త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Post Office RD | పోస్టాఫీస్ అందిస్తున్న బెస్ట్ స్కీం.. రూ.16 ల‌క్ష‌లు పొందండిలా..

Post Office RD | పోస్టాఫీస్‌లు ప్రతి వర్గం ప్రజల కోసం అనేక సంక్షేమ, పొదుపు పథకాలను అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా చిన్న పొదుపు పథకాల ద్వారా పేదలు, మధ్యతరగతి ప్రజలు ఎలాంటి రిస్క్ లేకుండా పెట్టుబడి పెట్టి మంచి రాబడిని పొందే అవకాశం కల్పిస్తున్నాయి. అలాంటి పథకాలలో పోస్టాఫీసులు నిర్వహించే రికరింగ్ డిపాజిట్ (ఆర్‌డీ) స్కీమ్ ఒకటి.

S

Business | Published On Jul 25, 2026, 12.05 pm IST

Post Office RD | పోస్టాఫీస్ అందిస్తున్న బెస్ట్ స్కీం.. రూ.16 ల‌క్ష‌లు పొందండిలా..
Advertisement

Post Office RD | పోస్టాఫీస్‌లు ప్రతి వర్గం ప్రజల కోసం అనేక సంక్షేమ, పొదుపు పథకాలను అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా చిన్న పొదుపు పథకాల ద్వారా పేదలు, మధ్యతరగతి ప్రజలు ఎలాంటి రిస్క్ లేకుండా పెట్టుబడి పెట్టి మంచి రాబడిని పొందే అవకాశం కల్పిస్తున్నాయి. అలాంటి పథకాలలో పోస్టాఫీసులు నిర్వహించే రికరింగ్ డిపాజిట్ (ఆర్‌డీ) స్కీమ్ ఒకటి. ఈ పథకం మెచ్యూరిటీ సమయంలో ఆకర్షణీయమైన మొత్తాన్ని అందిస్తుంది. పోస్టాఫీస్ చిన్న పొదుపు పథకాల కింద అమలవుతున్న ఈ ఆర్‌డీ స్కీమ్‌లో ఏ భారతీయ పౌరుడైనా పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో ప్రతి నెలా డిపాజిట్ చేసే అవకాశం ఉంటుంది. కనీసం రూ.100తోనే పెట్టుబడిని ప్రారంభించవచ్చు. గరిష్ట పెట్టుబడికి ఎలాంటి పరిమితి లేదు. పెట్టుబడిదారుడు తన సామర్థ్యానికి అనుగుణంగా ఎంత మొత్తమైనా జమ చేయవచ్చు.

మెచ్యూరిటీ కాలం 5 ఏళ్లు..

ప్రస్తుతం పోస్టాఫీస్ ఆర్‌డీ స్కీమ్‌పై వార్షికంగా 6.7 శాతం వడ్డీ లభిస్తోంది. ఈ పథకం మెచ్యూరిటీ కాలం 5 సంవత్సరాలు. అవసరమైతే మెచ్యూరిటీ అనంతరం మరో 5 సంవత్సరాల పాటు పొడిగించుకోవచ్చు. అలాగే ఐదేళ్ల కాలపరిమితితో రెండు ఆర్‌డీ ఖాతాలను కూడా తెరవడానికి అవకాశం ఉంటుంది. ఈ పథకంలో రుణ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. ఖాతాలో ఒక సంవత్సరం పాటు క్రమం తప్పకుండా డిపాజిట్ చేసిన తర్వాత, జమ చేసిన మొత్తంలో 50 శాతం వరకు రుణంగా పొందవచ్చు. మెచ్యూరిటీకి ముందే ఈ పథకం నుంచి బయటకు రావాలనుకుంటే, ఖాతా ప్రారంభించిన మూడు సంవత్సరాల తర్వాత అవకాశం ఉంటుంది. అయితే అలాంటి సందర్భంలో ఆర్‌డీ స్కీమ్‌కు వర్తించే వడ్డీ కాకుండా, పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతాకు వర్తించే వడ్డీ మాత్రమే చెల్లిస్తారు.

రూ.16 ల‌క్ష‌లు ఇలా వ‌స్తాయి..

ఐదేళ్ల మెచ్యూరిటీ పూర్తైన తర్వాత ఖాతాను మరో ఐదేళ్ల పాటు పొడిగించుకోవచ్చు. అంటే మొత్తం 10 సంవత్సరాల పాటు నిరంతరంగా పెట్టుబడి కొనసాగించవచ్చు. ప్రస్తుతం 6.7 శాతం వడ్డీ ఉన్నప్పటికీ, త్రైమాసిక సమీక్షల ఆధారంగా ఈ వడ్డీ రేటులో మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. ఈ పథకంలో మైనర్ల పేరుతో కూడా ఖాతా తెరవవచ్చు. తల్లిదండ్రులు లేదా సంరక్షకులు వారి తరఫున పెట్టుబడి పెట్టవచ్చు. అలాగే జాయింట్ అకౌంట్ ప్రారంభించే సౌకర్యం కూడా ఉంది. ప్రతి నెల రూ.9,500 చొప్పున పోస్టాఫీస్ ఆర్‌డీ స్కీమ్‌లో పెట్టుబడి పెడితే, 6.7 శాతం వార్షిక వడ్డీ రేటు ప్రకారం ఐదేళ్ల చివరికి మొత్తం రూ.6,77,980 లభిస్తుంది. ఇందులో రూ.1,07,980 వడ్డీ రూపంలో వస్తుంది. అదే పెట్టుబడిని మరో ఐదేళ్ల పాటు కొనసాగిస్తే, 10 సంవత్సరాల చివరికి మొత్తం రూ.16,23,123 పొందే అవకాశం ఉంటుంది. ఇందులో రూ.4,83,123 వడ్డీ రూపంలో లభిస్తుంది. ఈ 10 సంవత్సరాల కాలంలో మొత్తం రూ.11,40,000 పెట్టుబడిగా జమ చేసినట్లవుతుంది.

గమనిక: పోస్టాఫీస్ చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం ప్రతి త్రైమాసికం సమీక్షిస్తుంది. కాబట్టి భవిష్యత్తులో వడ్డీ రేట్లు మారే అవకాశం ఉంటుంది.

Advertisement
Advertisement