త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Apar Industries | ఒక్కో షేర్‌కు రూ.60 డివిడెండ్ ఇస్తున్న కంపెనీ.. తేదీ ఎప్పుడంటే..

Apar Industries | గ్లోబల్ ఎనర్జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సొల్యూషన్స్ సంస్థ ఏపార్ ఇండస్ట్రీస్ షేర్లు ట్రేడింగ్‌లో ఒత్తిడికి లోనవుతున్నాయి. వచ్చే వారం డివిడెండ్ రికార్డు తేదీ ఉండటంతో ఈ ఎలక్ట్రికల్ ఎక్విప్‌మెంట్ షేర్‌పై ఇన్వెస్టర్ల దృష్టి పెరిగే అవకాశం ఉంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఒక్కో ఈక్విటీ షేర్‌పై రూ.60 తుది డివిడెండ్‌ను కంపెనీ డైరెక్టర్ల బోర్డు ప్రకటించింది.

S

Business | Published On Sep 10, 2026, 5.19 pm IST

Apar Industries | ఒక్కో షేర్‌కు రూ.60 డివిడెండ్ ఇస్తున్న కంపెనీ.. తేదీ ఎప్పుడంటే..
Advertisement

Apar Industries | గ్లోబల్ ఎనర్జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సొల్యూషన్స్ సంస్థ ఏపార్ ఇండస్ట్రీస్ షేర్లు ట్రేడింగ్‌లో ఒత్తిడికి లోనవుతున్నాయి. వచ్చే వారం డివిడెండ్ రికార్డు తేదీ ఉండటంతో ఈ ఎలక్ట్రికల్ ఎక్విప్‌మెంట్ షేర్‌పై ఇన్వెస్టర్ల దృష్టి పెరిగే అవకాశం ఉంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఒక్కో ఈక్విటీ షేర్‌పై రూ.60 తుది డివిడెండ్‌ను కంపెనీ డైరెక్టర్ల బోర్డు ప్రకటించింది. ఈ డివిడెండ్‌కు వచ్చే సోమవారం రికార్డు తేదీగా నిర్ణయించారు. ఈ ఏడాది మేలో జరిగిన సమావేశంలో కంపెనీ బోర్డు ఒక్కో రూ.10 ముఖ విలువ కలిగిన షేర్‌పై రూ.60 డివిడెండ్‌ను సిఫారసు చేసింది. అంటే షేర్ ముఖ విలువపై ఇది 600 శాతం డివిడెండ్ అన్నమాట. అయితే ఈ డివిడెండ్ చెల్లింపుకు కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశం ఆమోదం తప్పనిసరి. సెప్టెంబర్ 21న కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశం జరగనుంది.

తేదీ ఎప్పుడు..

డివిడెండ్ పొందేందుకు అర్హత ఉన్న వాటాదారులను నిర్ణయించడానికి కంపెనీ సెప్టెంబర్ 14ను రికార్డు తేదీగా నిర్ణయించింది. డివిడెండ్ పొందాలనుకునే ఇన్వెస్టర్లు రికార్డు తేదీకి ముందు లేదా ఆ తేదీ నాటికి కంపెనీ షేర్లను కలిగి ఉండాలి. భారత స్టాక్ మార్కెట్‌లో ప్రస్తుతం టీ ప్లస్ వన్ సెటిల్‌మెంట్ విధానం అమల్లో ఉన్నందున, డివిడెండ్‌కు అర్హత పొందాలనుకునే ఇన్వెస్టర్లు సెప్టెంబర్ 14 సోమవారానికి ముందే షేర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 21న జరిగే వార్షిక సర్వసభ్య సమావేశంలో సభ్యులు డివిడెండ్‌ను ప్రకటించి ఆమోదించిన తర్వాత, చట్టబద్ధమైన గడువులోగా డివిడెండ్ చెల్లించనున్నారు. సాధారణంగా కార్పొరేట్ చర్య ప్రకటించిన తేదీ నుంచి 30 రోజుల్లోగా చెల్లింపు జరిగే అవకాశం ఉంటుంది.

5 ఏళ్ల‌లో 258 శాతం రాబ‌డి..

గురువారం ట్రేడింగ్ ముగిసే సమ‌యానికి ఎన్ఎస్ఈలో ఏపార్ ఇండ‌స్ట్రీస్ షేర్ ధ‌ర రూ.17,379 వ‌ద్ద స్థిర‌ప‌డింది. గ‌త కొద్ది రోజులుగా ఈ షేర్ ధ‌ర‌ల్లో ర్యాలీ కొన‌సాగుతుండ‌డం, ప్ర‌స్తుతం డివిడెండ్‌ను ప్ర‌క‌టించ‌డంతో ఈ షేర్ తీవ్ర అస్థిర‌త‌తో క‌దులుతోంది. గ‌త మూడు రోజులుగా షేర్ ధర స్వ‌ల్పంగా త‌గ్గిన‌ప్ప‌టికీ వారం ప్రాతిప‌దిక‌న చూస్తే ఈ షేర్ గ‌ణ‌నీయ‌మైన వృద్ధి సాధించింది. ఇక కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.73,071.42 కోట్లుగా ఉంది. కంపెనీ రిటర్న్ ఆన్ ఈక్విటీ 29.96 శాతంగా ఉంది. డేటా ప్రకారం గత మూడు నెలల్లో షేర్ ధర 28 శాతం పెరిగింది. ఈ ఏడాది ఇప్పటివరకు ఏకంగా 109.5 శాతం రాబడిని అందించింది. ఐదేళ్ల వ్యవధిలో షేర్ సుమారు 258 శాతం రాబడిని అందించగా, మరో దీర్ఘకాలిక లెక్క ప్రకారం సుమారు 2,543 శాతం వృద్ధిని నమోదు చేసింది.

భారీగా పెరిగిన లాభాలు..

2026-27 ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.453.05 కోట్లుగా నమోదైంది. 2025-26 ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో నమోదైన రూ.254.52 కోట్లతో పోలిస్తే లాభం గణనీయంగా పెరిగింది. ఇదే సమయంలో జూన్ త్రైమాసికంలో కంపెనీ నికర ఆదాయం రూ.6,477.35 కోట్లుగా ఉంది. మార్చి త్రైమాసికంలో ఇది రూ.6,460.98 కోట్లుగా నమోదైంది. కంపెనీ షేర్‌కు సంబంధించిన ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఒక్కో షేర్‌కు ఆదాయం రూ.112.79గా నమోదైంది. 2025-26 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో నమోదైన రూ.63.36తో పోలిస్తే ఇది భారీ పెరుగుదల. అయితే డివిడెండ్‌కు అర్హత, రికార్డు తేదీ, చెల్లింపు వంటి అంశాల్లో తుది నిర్ణయం కంపెనీ అధికారిక ప్రకటనలు, సర్వసభ్య సమావేశం ఆమోదంపై ఆధారపడి ఉంటుంది.

Advertisement
Advertisement