త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Maheshkumar Goud | పార్టీ గీత దాటితే ఎవ‌రైనా ఒక‌టే.. రాజ‌గోపాల్‌రెడ్డికి టీపీసీసీ చీఫ్ వార్నింగ్‌

Maheshkumar Goud | మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు నా దృష్టికి వ‌చ్చాయ‌ని.. ఈ విష‌యంపై పార్టీ హైక‌మాండ్‌తో మాట్లాడతాన‌ని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మ‌హేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు.

S

Telangana | Published On Aug 14, 2026, 7.05 pm IST

Maheshkumar Goud | పార్టీ గీత దాటితే ఎవ‌రైనా ఒక‌టే.. రాజ‌గోపాల్‌రెడ్డికి టీపీసీసీ చీఫ్ వార్నింగ్‌
Advertisement
  • ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై హైక‌మాండ్‌తో మాట్లాడ‌తా
  • టీపీసీసీ చీఫ్ మ‌హేశ్‌కుమార్‌గౌడ్‌

Maheshkumar Goud | త్రినేత్ర‌.న్యూస్‌: మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు నా దృష్టికి వ‌చ్చాయ‌ని.. ఈ విష‌యంపై పార్టీ హైక‌మాండ్‌తో మాట్లాడతాన‌ని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మ‌హేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. పార్టీ గీత దాటితే ఎవ‌రైనా ఒక‌టేన‌ని.. ఎంత‌టి వారిపై అయినా క‌ఠిన చ‌ర్య‌లు ఉంటాయ‌ని స్ప‌ష్టం చేశారు. క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడితే క‌చ్చితంగా చర్యలుంటాయ‌ని హెచ్చ‌రించారు. ఈమేర‌కు ఆయ‌న హైద‌రాబాద్‌లో శుక్ర‌వారం మీడియాతో మాట్లాడారు.

రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయి. ఈ విషయాన్ని ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టి తీసుకెళ్తా. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఎంతటి నేతనైనా సహించేది లేదు. పార్టీ గీత దాటితే ముఖ్యమంత్రితో సహా ఎవరైనా సరే అందరూ ఒకటే. క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడితే క‌చ్చితంగా చర్యలు ఉంటాయి. రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, తీసుకోవాల్సిన చర్యలపై హైకమాండ్‌తో చర్చిస్తా.

అంద‌రి కోర్కెలు తీర్చ‌డం సాధ్యం కాదు..

రాజగోపాల్ రెడ్డి నాకు మంచి మిత్రుడు. ఆయ‌న ఆవేద‌న‌ను అర్థం చేసుకుంటా. నాలుగు గోడ‌ల మ‌ధ్య మాట్లాడాల్సిన‌వి బ‌హిరంగంగా మాట్లాడొద్దు. పార్టీ అధిష్టానం కొన్ని హామీలు ఇచ్చి ఉండవచ్చు. పార్టీకి వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడటానికి ఎవరికీ హక్కు లేదు. పదవులు, మంత్రివర్గ విస్తరణపై పార్టీ హైకమాండ్‌దే తుది నిర్ణయం. ఒకేరోజు అందరి కోరికలు తీర్చడం ఎంతటి వారికైనా సాధ్యం కాదు అని మ‌హేశ్‌కుమార్ గౌడ్ పేర్కొన్నారు.

Advertisement
Advertisement