Vemula Prashanth Reddy | జైల్లో పెట్టినా కాంగ్రెస్ సర్కార్పై నా పోరాటం ఆగదు: వేముల ప్రశాంత్ రెడ్డి
Vemula Prashanth Reddy | తన నియోజకవర్గంలోని భీంగల్లో అభివృద్ధి పనులను తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) తలపెట్టిన నిరాహాద దీక్షను (Hunger Strike) ప్రభుత్వం అడ్డుకున్నది.
Vemula Prashanth Reddy | త్రినేత్ర.న్యూస్: తన నియోజకవర్గంలోని భీంగల్లో అభివృద్ధి పనులను తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) తలపెట్టిన నిరాహాద దీక్షను (Hunger Strike) ప్రభుత్వం అడ్డుకున్నది. ఇందులో భాగంగా ఆయనను హౌస్ అరెస్ట్ చేసింది. ప్రభుత్వ చర్యపై ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కఠోర నిరాహార దీక్షను పోలీసు బలగాలతో అడ్డుకోవడం రాష్ట్ర ప్రభుత్వ అప్రజాస్వామిక, రాక్షస చర్య మండిపడ్డారు. తనను జైల్లో పెట్టినా ప్రజల కోసం కాంగ్రెస్ సర్కార్పై తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. గృహ నిర్బంధంలో (House Arrest) ఉన్నా తన దీక్ష కొనసాగుతుందన్నారు. భీంగల్ అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అడిగితే అరెస్టులు చేస్తారా అని ప్రశ్నించారు. ప్రజా సమస్యల సాధన కోసం తాను అహింసా మార్గంలో నిరసన తెలియజేస్తుంటే, ప్రభుత్వం పోలీసులతో ఉక్కుపాదం మోపాలని చూడటం శోచనీయమన్నారు.
గత ప్రభుత్వ హయాంలో మంజూరై, దాదాపు 75 శాతం పనులు పూర్తి చేసుకున్న భీంగల్ (Bheemga) 100 పడకల దవాఖాన నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. అలాగే, భీంగల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు పూర్తి చేయాలని, మూతపడిన భీంగల్ బస్ డిపోను పునఃప్రారంభించాలని కోరారు. గత మున్సిపల్ ఎన్నికల ముందు రూ.12 కోట్ల నిధులతో ప్రారంభించిన సీసీ రోడ్ల నిర్మాణ పనులు ఇంకా అసంపూర్తిగా ఉన్నాయని, వాటిని వెంటనే పూర్తి చేయాలన్నారు. ఈ పెండింగ్ పనుల సాధన కోసమే చుక్క మంచి నీరు కూడా ముట్టకుండా ఒక రోజు కఠోర నిరాహార దీక్ష చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ఎలాంటి రాస్తారోకోలు, ధర్నాలు చేయకుండా, తనకు తాను శిక్ష వేసుకుంటూ ఒకరోజు దీక్ష చేస్తానని ప్రకటిస్తే ప్రభుత్వం (Congress Govt) ఎందుకు ఉలిక్కిపడుతున్నదని ప్రశ్నించారు. తాను నిద్రలేవక ముందే వందలాది మంది పోలీసులు తన ఇంటిని చుట్టుముట్టి తనను బయటకు వెళ్లనివ్వకుండా గృహ నిర్బంధం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నా గొంతు నొక్కలేరు, జైల్లో పెట్టినా ప్రజల కోసం కాంగ్రెస్ సర్కార్ పై నా పోరాటం ఆగదు.
గృహ నిర్బంధంలో ఉన్నా నా దీక్ష కొనసాగుతుంది.
ప్రజా సమస్యల పరిష్కారం కోసమే శాంతియుత దీక్ష.. పోలీసుల నిర్బంధం అప్రజాస్వామికం.
భీంగల్ అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అడిగితే అరెస్టులు చేస్తారా?
— BRS Party (@BRSparty) July 15, 2026
సంబంధిత వార్తలు

Guvvala Balaraju | ఆర్ఎస్ ప్రవీణ్కుమార్పై క్రిమినల్ చర్యలు తీసుకోండి.. సీఎంకు రేవంత్కు గువ్వల బాలరాజు లేఖ
జులై 15, 2026

Telegram | టెలిగ్రామ్లో భారీ అప్డేట్.. యూజర్లకు రిచ్ టెక్స్ట్ ఎడిటర్, కమ్యూనిటీస్ సహా కొత్త ఫీచర్లు..
జులై 15, 2026

Indian Seafarers | పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు.. భారతీయ నావికుల భద్రతకు కేంద్రం కీలక నిర్ణయం
జులై 15, 2026
తాజావార్తలు
- ●Guvvala Balaraju | ఆర్ఎస్ ప్రవీణ్కుమార్పై క్రిమినల్ చర్యలు తీసుకోండి.. సీఎంకు రేవంత్కు గువ్వల బాలరాజు లేఖ
- ●Telegram | టెలిగ్రామ్లో భారీ అప్డేట్.. యూజర్లకు రిచ్ టెక్స్ట్ ఎడిటర్, కమ్యూనిటీస్ సహా కొత్త ఫీచర్లు..
- ●Indian Seafarers | పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు.. భారతీయ నావికుల భద్రతకు కేంద్రం కీలక నిర్ణయం
- ●CCI | సీసీఐని పునఃప్రారంభించండి.. కేంద్ర మంత్రిని కోరనున్న బీఆర్ఎస్
- ●Bonalu 2026 | తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా ఆషాఢ బోనాలు.. రేపే తొలిబోనం
- ●CM Revanth Reddy | నైపుణ్యమే.. మీ భవిష్యత్తుకు మార్గం : సీఎం రేవంత్ రెడ్డి

Guvvala Balaraju | ఆర్ఎస్ ప్రవీణ్కుమార్పై క్రిమినల్ చర్యలు తీసుకోండి.. సీఎంకు రేవంత్కు గువ్వల బాలరాజు లేఖ

Telegram | టెలిగ్రామ్లో భారీ అప్డేట్.. యూజర్లకు రిచ్ టెక్స్ట్ ఎడిటర్, కమ్యూనిటీస్ సహా కొత్త ఫీచర్లు..

Indian Seafarers | పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు.. భారతీయ నావికుల భద్రతకు కేంద్రం కీలక నిర్ణయం

CCI | సీసీఐని పునఃప్రారంభించండి.. కేంద్ర మంత్రిని కోరనున్న బీఆర్ఎస్



