త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLA Sabitha | గూండాలు దాడి చేశారని అనుమానముంది

MLA Sabitha | అసెంబ్లీ బ‌య‌ట‌ పోలీసుల ముసుగులో గూండాలు మాపై అలా ప్ర‌వ‌ర్తించారేమోన‌ని అనుమానంగా ఉంద‌ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే స‌బితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. కేటీఆర్ లేక‌పోతే మ‌మ్మ‌ల్ని కింద‌ప‌డేసి తొక్కేవార‌ని వాపోయారు. ఈ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తే ఎవ‌రినైనా గొంతు ప‌ట్టి పిసికేస్తున్నార‌ని మండిప‌డ్డారు.

S

Telangana | Published On Sep 7, 2026, 1.34 pm IST

MLA Sabitha | గూండాలు దాడి చేశారని అనుమానముంది
Advertisement
  • కేటీఆర్ లేకపోతే మమ్మల్ని కిందపడేసి తొక్కేవారు
  • రేవంత్‌కు మ‌హిళ‌లంటే గౌర‌వం లేదు
  • పైగా సీత‌క్క డ్రామాలు అని మాట్లాడుతుంది
  • మాజీ మంత్రి, ఎమ్మెల్యే స‌బితా ఇంద్రారెడ్డి ఆగ్ర‌హం

MLA Sabitha | త్రినేత్ర‌.న్యూస్‌: అసెంబ్లీ బ‌య‌ట‌ పోలీసుల ముసుగులో గూండాలు మాపై అలా ప్ర‌వ‌ర్తించారేమోన‌ని అనుమానంగా ఉంద‌ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే స‌బితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. కేటీఆర్ లేక‌పోతే మ‌మ్మ‌ల్ని కింద‌ప‌డేసి తొక్కేవార‌ని వాపోయారు. ఈ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తే ఎవ‌రినైనా గొంతు ప‌ట్టి పిసికేస్తున్నార‌ని మండిప‌డ్డారు. మోదీ, అదానీ బొమ్మ‌లు ఉన్న‌ టీ ష‌ర్ట్స్ వేసుకొని రాహుల్ గాంధీ పార్ల‌మెంట్‌కు వెళ్లార‌ని.. అక్క‌డ ఒక న్యాయం, ఇక్క‌డ ఒక న్యాయం ఉంటుందా అని ప్ర‌శ్నించారు. పైగా డ్రామాలు ఆడుతున్నార‌ని మంత్రి సీత‌క్క మాట్లాడ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. తెలంగాణ భ‌వ‌న్‌లో సోమ‌వారం ఆమె మాట్లాడుతూ రేవంత్ ప్ర‌భుత్వంపై మండిప‌డ్డారు.

ఈరోజు అసెంబ్లీ బయట జరిగిన ఘటన హేయమైనది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే పోలీసులు అతిగా ప్రవర్తించారు. మా ఎమ్మెల్యేలు వేసుకున్న నల్ల టీ షర్ట్స్ పై అభ్యంతరకరమైన పదాలు ఏం లేవు. ముఖ్యమంత్రికి మహిళలంటే గౌరవం లేదు. మా మహిళ నాయకురాలు సునీతా లక్ష్మారెడ్డి చీర పట్టుకొని లాగారు. నా గొంతు, జుట్టు పట్టుకొని లాగారు.

పాలిటెక్నిక్ విద్యార్థులు ఇలానే ప్రశ్నిస్తే గొంతు పట్టుకొని పిసికారు. ఈ ప్రభుత్వంలో ప్రశ్నిస్తే గొంతు పట్టుకొని పిసికేస్తున్నారు. కేటీఆర్ లేకపోతే మమ్మల్ని కిందపడేసి తొక్కేవారు. ఈ ప్రభుత్వం ఏ విధంగా అవలంబిస్తుందో ప్రజలు గమనించాలి. పాలనపై ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ముఖ్యమంత్రిని సంతృప్తి ప‌రిచేందుకే పోలీసులు అలా ప్రవర్తించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అహంకారం ఎక్కువైంది. జరిగిన ఘటనపై మహిళా మంత్రి సీతక్క ఖండించాల్సింది పోయి డ్రామాలు అని మాట్లాడుతుంది. వెయ్యి రోజుల పాలనపై హామీలు అమలు చేయాలని మేం అడిగాం. మమ్మల్ని అసెంబ్లీకి రాకుండా గేటు వద్దే అడ్డుకున్నారు అని స‌బితా ఇంద్రారెడ్డి మండిప‌డ్డారు.

Advertisement
Advertisement