త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Boora Narsaiah Goud | తెలంగాణ అమరుల ఆత్మలు ఘోషిస్తున్నాయి

హైదరాబాద్ సంస్థాన విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ఎందుకు జరపరు? అమరవీరుల స్మారకానికి తాళాలెందుకు? తెలంగాణ ప్రభుత్వాలపై బూర నర్సయ్య గౌడ్ సంచలన వ్యాఖ్యలు.

J

Telangana | Published On Aug 26, 2026, 7.25 pm IST

Boora Narsaiah Goud | తెలంగాణ అమరుల ఆత్మలు ఘోషిస్తున్నాయి
Advertisement
  • సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకపోవడంపై బూర నర్సయ్య గౌడ్ తీవ్ర అసంతృప్తి
  • నిజాం, రజాకార్ల అకృత్యాలకు 20 వేల మందికి పైగా బలయ్యారని సుందర్‌లాల్ కమిటీ నివేదికను గుర్తుచేసిన వైనం
  • మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు అధికారికంగా జరుపుకుంటున్నప్పుడు తెలంగాణలో ఎందుకు జరపరో చెప్పాలని నిలదీత
  • ట్యాంక్ బండ్ పై జయశంకర్ సార్ విగ్రహం లేకపోవడం, అమరుల స్తూపానికి లాక్ అండ్ కీ వేయడంపై విమర్శలు

Boora Narsaiah Goud | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ (Telangana) రాష్ట్రం ఏర్పడి పదేళ్లు దాటినా.. స్వరాష్ట్రంలోనే అమరులకు అడుగడుగునా ఘోర అవమానం జరుగుతోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకపోవడం, ఉద్యమకారుల త్యాగాలను పాలకులు విస్మరించడంపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఏడు దశాబ్దాల వివక్ష.. సెప్టెంబర్ 17ను ఎందుకు విస్మరిస్తున్నారు?

యావత్ భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వస్తే.. తెలంగాణకు మాత్రం ఏడాది ఆలస్యంగా 1948 సెప్టెంబర్ 17న విముక్తి లభించిందని ఆయన గుర్తుచేశారు. ఆనాడు నిజాం దోపిడీ, రజాకార్ల (Razakars) రక్త చరిత్ర, జమీందార్లు, దొరల వెట్టిచాకిరీపై పోరాడి వేలాది మంది ప్రాణత్యాగం చేశారన్నారు. "నాటి ఊచకోతలో సుమారు 20 వేల మంది చనిపోయారని అధికారిక సుందర్‌లాల్ కమిటీ (The Sunderlal Committee Report) వెల్లడించింది. నేటికీ ఆ అమరుల ఆత్మలు ఘోషిస్తూనే ఉన్నాయి. అయినా 76 ఏళ్లుగా ఏ ప్రభుత్వమూ వారికి అధికారికంగా నివాళులు అర్పించే కనీస బాధ్యత తీసుకోలేదు" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఆ రాష్ట్రాల్లో అఫీషియల్.. ఇక్కడ మాత్రం పట్టనట్టా?

అప్పటి హైదరాబాద్ సంస్థానంలో (Hyderabad State) భాగమైన కర్ణాటక, మహారాష్ట్రల్లోని ప్రాంతాలు సెప్టెంబర్ 17ను నేటికీ అధికారికంగా విమోచన దినోత్సవంగా జరుపుకుంటున్నాయి. కానీ, ఆ పోరాటానికి ప్రధాన కేంద్రమైన తెలంగాణలో మాత్రం ప్రభుత్వాలు దీనిని అఫీషియల్‌గా (Official) ఎందుకు నిర్వహించడం లేదని ఆయన సూటిగా ప్రశ్నించారు.

అమరుల స్తూపానికి 'లాక్ అండ్ కీ' ఎందుకు?

తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో ప్రాణాలర్పించిన వారిని ప్రభుత్వాలు గాలికి వదిలేశాయని బూర నర్సయ్య విమర్శించారు.

1969 నాటి తొలి దశ ఉద్యమంలో 369 మంది యువకులు పోలీసుల తూటాలకు బలయ్యారు.

మలి దశ ఉద్యమంలో దాదాపు 1200 మంది తెలంగాణ కోసం బలిదానాలు చేశారు.

రాష్ట్రం వచ్చి ఇన్నేళ్లవుతున్నా ఇప్పటికీ కోట్ల రూపాయలతో నిర్మించిన అమరవీరుల స్మారక స్తూపం (Martyrs Memorial) లాక్ అండ్ కీ (Lock and Key) లోనే ఎందుకు ఉంచారని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. తెలంగాణ ఉద్యమానికి లైఫ్ టైమ్ పనిచేసిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ కనీసం ఆరడుగుల విగ్రహాన్ని ట్యాంక్ బండ్ లేదా నెక్లెస్ రోడ్ మీద పెట్టకపోవడం గత, ప్రస్తుత ప్రభుత్వాల నిర్లక్ష్యానికి పరాకాష్ట అని ఆయన దుయ్యబట్టారు.

Advertisement
Advertisement