త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Formation Day Malaysia | మలేషియాలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. చీఫ్ గెస్ట్‌గా కేటీఆర్, అండగా నిలిచిన ప్రవాస సంఘాలు

మలేషియాలో జరగనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమైంది. జూన్ 6న జరిగే ఈ మెగా ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా కేటీఆర్ హాజరుకానున్నారు.

J

Telangana | Published On May 26, 2026, 8.50 pm IST

Telangana Formation Day Malaysia | మలేషియాలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. చీఫ్ గెస్ట్‌గా కేటీఆర్, అండగా నిలిచిన ప్రవాస సంఘాలు
Advertisement
  • మలేషియాలో బీఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ, మలేషియా తెలంగాణ అసోసియేషన్ (MYTA) ఆధ్వర్యంలో జూన్ 6న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
  • ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయనున్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
  • వేడుకలకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన 1955 నాటి పురాతన సంస్థ 'మలేషియా తెలుగు అకాడమీ'
  • ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న బీఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల
  • మద్దతుగా నిలిచిన పలు ఇతర భారతీయ ప్రవాస సంఘాలు

Telangana Formation Day Malaysia | త్రినేత్ర.న్యూస్ : మలేషియా (Malaysia) గడ్డపై తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. బీఆర్‌ఎస్ ఎన్ఆర్ఐ (BRS NRI), మలేషియా తెలంగాణ అసోసియేషన్ (MYTA) సంయుక్త ఆధ్వర్యంలో జూన్ 6న ఈ వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహించనున్నారు. ఈ మెగా ఈవెంట్‌కు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) ముఖ్య అతిథిగా (Chief Guest) హాజరుకానున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రవాస సంఘాలు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నాయి.

మలేషియా తెలుగు అకాడమీ సంపూర్ణ మద్దతు

ఈ వేడుకల ఏర్పాట్లలో భాగంగా, బీఆర్‌ఎస్ ఎన్ఆర్ఐ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల (Mahesh Bigala) ఇటీవల 'మలేషియా తెలుగు అకాడమీ'ని సందర్శించారు. ఈ సందర్భంగా అకాడమీ నాయకులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని అకాడమీ స్పష్టం చేసింది. ఈ కార్యక్రమానికి కేటీఆర్‌ను సాదరంగా ఆహ్వానిస్తూ.. ఈవెంట్‌ను గ్రాండ్‌గా సక్సెస్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ఈ మీటింగ్‌లో మహేశ్ బిగాలతో పాటు బీఆర్‌ఎస్, MYTA టీమ్ సభ్యులు మారుతి కుర్మ, సందీప్ గౌడ్ తదితర కమ్యూనిటీ లీడర్లు పాల్గొన్నారు.

Telangana Formation Day in Malaysia KTR to Attend as Chief Guest

ఐదు తరాల చరిత్ర.. 5 లక్షల మంది తెలుగువారు

1955లో స్థాపించబడిన మలేషియా తెలుగు అకాడమీ.. ఆ దేశంలోని అత్యంత పురాతన తెలుగు సంస్థగా గుర్తింపు పొందింది. ఐదు తరాలుగా మలేషియాలో స్థిరపడిన సుమారు 5 లక్షల మందికి పైగా తెలుగు వారి సంస్కృతీ సంప్రదాయాలకు ఇది అద్దం పడుతోంది. ఇప్పుడు ఈ సంస్థ తెలంగాణ వేడుకలకు అండగా నిలవడం విశేషం. ఈ కార్యక్రమ నిర్వహణ కోసం మారుతి కుర్మ నేతృత్వంలోని బీఆర్‌ఎస్ మలేషియా టీమ్, తిరుపతి ఆధ్వర్యంలోని MYTA టీమ్ చురుకుగా కోఆర్డినేట్ (Coordinate) చేసుకుంటున్నాయి.

కదం తొక్కుతున్న ఇతర సంఘాలు

కేవలం తెలుగు అకాడమీ మాత్రమే కాకుండా.. మలేషియాలో స్థిరపడిన అనేక ఇతర భారతీయ, ప్రాంతీయ సంఘాలు కూడా ఈ వేడుకలకు తమ సంఘీభావాన్ని ప్రకటించాయి. మద్దతు తెలిపిన వాటిలో ప్రధానంగా.. తెలుగు ఎక్స్‌పాట్స్ అసోసియేషన్ ఆఫ్ మలేషియా (TEAM), మలేషియా ఆంధ్ర అసోసియేషన్ (MAA), మలేషియా తెలుగు ఫౌండేషన్ (MTF), తెలుగు అసోసియేషన్ ఆఫ్ మలేషియా (TAM),  తమిళ్ ఎక్స్‌పాట్స్ అసోసియేషన్ ఆఫ్ మలేషియా (TEM), మలయాళీ కుటుంబం (MAKASA), కన్నడ, పంజాబీ, ఒడిశా అసోసియేషన్లు, భారతీయ అసోసియేషన్ ఆఫ్ మలేషియా (BAM) ఉన్నాయి.

ప్రవాస భారతీయుల మధ్య ఉన్న సాంస్కృతిక ఐక్యతకు (Cultural Unity), తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవానికి ఈ మద్దతు నిదర్శనమని మహేశ్ బిగాల హర్షం వ్యక్తం చేశారు. మద్దతు తెలిపిన ప్రతి ఒక్క సంఘానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ చారిత్రక వేడుక.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస తెలంగాణవాసుల సత్తాను చాటిచెప్పనుందని నిర్వాహకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement