త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

NRI BRS Australia | కాంగ్రెస్ వెయ్యి రోజుల పాల‌న‌పై ఆస్ట్రేలియాలో నిర‌స‌న‌

NRI BRS Australia | తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తవుతున్న సందర్భంగా, ఎన్నికల హామీల అమలు, ప్రభుత్వ పనితీరు, ప్రతిపక్ష ప్రజాప్రతినిధులపై జరుగుతున్న చర్యలను నిరసిస్తూ ఎన్నారై బీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో నల్ల దుస్తులు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు.

S

Telangana | Published On Sep 10, 2026, 3.46 pm IST

NRI BRS Australia | కాంగ్రెస్ వెయ్యి రోజుల పాల‌న‌పై ఆస్ట్రేలియాలో నిర‌స‌న‌
Advertisement
  • బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై దాడులకు తీవ్ర ఖండన
  • ఎన్నారై బీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఇన్‌చార్జ్ అనిల్ బైరెడ్డి

NRI BRS Australia | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తవుతున్న సందర్భంగా, ఎన్నికల హామీల అమలు, ప్రభుత్వ పనితీరు, ప్రతిపక్ష ప్రజాప్రతినిధులపై జరుగుతున్న చర్యలను నిరసిస్తూ ఎన్నారై బీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో నల్ల దుస్తులు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎన్నారై బీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఇన్‌చార్జ్ అనిల్ బైరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియాలోని ఎన్నారై బీఆర్ఎస్ ఆస్ట్రేలియా సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ప్రజలకు స్పష్టమైన సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా, హామీల అమలులో జాప్యం, ప్రజా సమస్యల పరిష్కారంలో వైఫల్యం మరియు పాలనలో లోపాలపై వారు ఆందోళన వ్యక్తం చేశారు.

అలాగే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై పోలీసు చర్యలు, అరెస్టులు, నిర్బంధాలు, శాసనసభ, శాసన మండలిలో సస్పెన్షన్లు తదితర అంశాలపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాల ప్రజల సమస్యలను స్వేచ్ఛగా ప్రస్తావించే అవకాశం ఉండాలని వారు పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై దాడులు, ఆయనకు సంబంధించిన భద్రతా అంశాలపై కూడా ఆందోళన కలిగిస్తున్నాయని ఎన్నారై బీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఇన్‌చార్జ్ అనిల్ బైరెడ్డి తెలిపారు. ఈ అంశాలపై సమగ్రంగా విచారణ జరిపి, వాస్తవాలను ప్రజల ముందుంచాలని వారు కోరారు.

ప్రజాస్వామ్యంలో అధికార పక్షంతో పాటు ప్రతిపక్షానికి కూడా సమానమైన ప్రాధాన్యత ఉంటుందని, ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు భయాందోళనలు లేకుండా తమ బాధ్యతలను నిర్వర్తించే వాతావరణం ఉండాలని వారు పేర్కొన్నారు. “ఎన్నికల హామీల అమలు, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ మరియు ప్రతిపక్ష ప్రజాప్రతినిధుల హక్కులను కాపాడటం ప్రభుత్వ బాధ్యత” అని ఎన్నారై బీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఇన్‌చార్జ్ శ్రీ అనిల్ బైరెడ్డిపేర్కొన్నారు.

ఆస్ట్రేలియాలోని తెలంగాణ ప్రవాసులు రాష్ట్రంలోని పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారని, ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం, చట్టబద్ధ పాలన కొనసాగాలని వారు కోరుకుంటున్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎన్నారై బీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఇన్‌చార్జ్ అనిల్ బైరెడ్డితో పాటు రమేష్ ముత్యాల, రాహుల్ నడిదె, సత్య గుండా, రవీందర్ చుక్కా, కార్తీక్, రమణ, చందు పాల్గొన్న వారిలో ఉన్నారు.

Advertisement
Advertisement