త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chemical dumping Nagarjuna Sagar | నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్స్‌లో డేంజర్ బెల్స్: కెమికల్స్ పారబోసిందెవరు?

నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్స్ కలుషితమయ్యాయి. దయ్యాల గండి వద్ద గుర్తుతెలియని వ్యక్తులు ప్రమాదకర కెమికల్స్ పారబోయడంతో నీరు రంగుమారింది. అధికారుల విచారణ షురూ.

J

Telangana | Published On Sep 5, 2026, 1.19 pm IST

Chemical dumping Nagarjuna Sagar | నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్స్‌లో డేంజర్ బెల్స్: కెమికల్స్ పారబోసిందెవరు?
Advertisement
  • నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్స్‌లో గుర్తుతెలియని దుండగులు కెమికల్స్ పారబోసినట్లు ఆరోపణలు
  • దయ్యాల గండి ప్రాంతంలో అకస్మాత్తుగా నీటి రంగు మారడంతో వెలుగులోకి వచ్చిన ఉదంతం
  • స్పాట్‌ను పరిశీలించి వాటర్ శాంపిల్స్ సేకరించిన ఎన్నెస్పీ (NSP), పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులు
  • టెస్టింగ్ నివేదికలు వచ్చాకే అసలు నిజాలు బయటపడతాయని తెలిపిన ఎస్ఈ మల్లికార్జునరావు

Chemical dumping Nagarjuna Sagar | త్రినేత్ర.న్యూస్ : నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) బ్యాక్ వాటర్స్‌లో రసాయనాల కలకలం స్థానికంగా తీవ్ర ఆందోళన రేపుతోంది. దయ్యాల గండి ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు ప్రమాదకరమైన కెమికల్స్ (Chemicals) పారబోసినట్లు సమాచారం అందడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఎలాంటి కదలికల్లేని ఆ ప్రాంతంలో నీటి రంగు అకస్మాత్తుగా మారడంతో ఈ కాలుష్య వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

విషయం తెలుసుకున్న వెంటనే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ (NSP) ఎస్ఈ మల్లికార్జునరావు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (Pollution Control Board) అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. కెమికల్స్ వల్ల కలుషితమైన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అసలు ఆ ప్రాంతానికి రసాయనాలు ఎలా వచ్చాయి? ఎవరు డంప్ చేశారు? అనే కోణంలో ఆరా తీస్తున్నారు.

నీరు ఏ స్థాయిలో కలుషితం అయింది? అందులో ఎలాంటి కెమికల్స్ కలిశాయి? అనే విషయాలను నిర్ధారించేందుకు అధికారులు వాటర్ శాంపిల్స్ (Water samples) సేకరించారు. ఈ ప్రాంతంలో ఆకతాయిలు పనిగట్టుకుని ఈ చర్యకు పాల్పడ్డారా లేక ఏదైనా పరిశ్రమల వ్యర్థాలను ఇక్కడ పారబోశారా అన్నది తేలాల్సి ఉంది.

సేకరించిన నీటి శాంపిల్స్‌ను టెస్టింగ్ కోసం ల్యాబ్‌కు పంపిస్తామని ఎస్ఈ మల్లికార్జునరావు వెల్లడించారు. ల్యాబ్ రిపోర్ట్స్ (Lab reports) వచ్చిన తర్వాతే నీటి రంగు మారడానికి గల అసలు కారణాలు, అందులో కలిసిన రసాయనాల తీవ్రత ఏంటనేది స్పష్టంగా తెలుస్తుందని, కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.

Advertisement
Advertisement