త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chhattisgarh Encounter | ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో ఎన్‌కౌంట‌ర్‌.. చివ‌రి తెలుగు మావోయిస్టు మృతి

Chhattisgarh Encounter | ఛత్తీస్‌గఢ్‌లోని (Chhattisgarh Encounter) కాంకేర్‌ జిల్లాలో భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జ‌రిగాయి. ఈ ఎన్‌కౌంట‌ర్‌లో ప్ర‌తాప్‌పూర్‌ మావోయిస్టు ఏరియా క‌మాండ‌ర్ రూపి రెడ్డి (Rupi Reddy) మ‌ర‌ణించారు.

G

Telangana | Published On Apr 13, 2026, 11.38 am IST

Chhattisgarh Encounter | ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో ఎన్‌కౌంట‌ర్‌.. చివ‌రి తెలుగు మావోయిస్టు మృతి
Advertisement

Chhattisgarh Encounter | త్రినేత్ర‌.న్యూస్‌: ఛత్తీస్‌గఢ్‌లోని (Chhattisgarh Encounter) కాంకేర్‌ జిల్లాలో భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జ‌రిగాయి. ఈ ఎన్‌కౌంట‌ర్‌లో ప్ర‌తాప్‌పూర్‌ మావోయిస్టు ఏరియా క‌మాండ‌ర్ రూపి రెడ్డి (Rupi Reddy) మ‌ర‌ణించారు. సోమ‌వారం ఉద‌యం ఛోటే బేథియా (Chhote Bethiya) అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం భ‌ద్ర‌తా ద‌ళాలు, స్థానిక పోలీసులు గాలింపు చేప‌ట్టాయి. ఈ క్ర‌మంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది.

పోలీసుల కాల్పుల్లో బస్తర్‌కు చెందిన చివరి తెలుగు మావోయిస్టు రూపీరెడ్డి అలియాస్ రంగాబోయిన భాగ్య మృతి చెందారు. ఈ కాల్పుల సమయంలో మరికొందరు మావోయిస్టులు అడవుల్లోకి పారిపోయారు. కాగా, ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నమ‌ని కాంకేర్ ఎస్పీ నిఖిల్ ర‌ఖేచా వెల్లడించారు. రూపీ రెడ్డిపై రూ.5 ల‌క్ష‌ల న‌జ‌రాన ఉంద‌ని తెలిపారు. ఆమె భర్త విజయ్‌రెడ్డి 2025లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మ‌ర‌ణించారు.

 

 

Advertisement
Advertisement