త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dead Son Marriage | మహబూబాబాద్‌లో వింత ఆచారం: చనిపోయిన కొడుకుకు 23 ఏళ్లుగా ఏటా పెళ్లి చేస్తున్న తల్లిదండ్రులు

ప్రేమ వివాహానికి పెద్దలు అంగీకరించలేదని ఆత్మహత్య చేసుకున్న కొడుకుపై ఆ తల్లిదండ్రులకు ఉన్న అపారమైన ప్రేమ ఇది. చనిపోయిన తమ కొడుకు, అతడి ప్రేయసిల విగ్రహాలను ఇంట్లోనే ప్రతిష్ఠించి గత 23 ఏళ్లుగా శ్రీరామనవమి రోజున వారికి ఏటా పెళ్లి జరిపిస్తున్నారు. తెలంగాణలోని మహబూబాబాద్‌ జిల్లాలో జరిగిన ఈ ఘటన అందరినీ కంటతడి పెట్టిస్తోంది.

J

Warangal | Published On Mar 28, 2026, 7.51 pm IST

Dead Son Marriage | మహబూబాబాద్‌లో వింత ఆచారం: చనిపోయిన కొడుకుకు 23 ఏళ్లుగా ఏటా పెళ్లి చేస్తున్న తల్లిదండ్రులు
Advertisement

Dead Son Marriage | త్రినేత్ర.న్యూస్ : ప్రేమించి ప్రాణాలు కోల్పోయిన తమ కొడుకు కోసం ఆ తల్లిదండ్రులు పడుతున్న తపన ప్రతి ఒక్కరి హృదయాన్ని ద్రవింపజేస్తోంది. కన్నపేగు బంధం ఎంత బలమైనదో, తమ బిడ్డపై వారికి ఉన్న ప్రేమ ఎంతటిదో ఈ ఘటన రుజువు చేస్తోంది. బాధను దిగమింగుకుని.. తమ బిడ్డ జ్ఞాపకాలను పదిలంగా కాపాడుకుంటూ, వారు చేస్తున్న ఓ అరుదైన కార్యక్రమం ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాకు చెందిన లాలు, సుక్కమ్మ దంపతులు గత 23 ఏళ్లుగా చనిపోయిన తమ కొడుకుకు ప్రతి సంవత్సరం వివాహం జరిపిస్తూ వస్తున్నారు.

అసలేం జరిగిందంటే..

లాలు, సుక్కమ్మ దంపతుల కుమారుడు రామ్ కోటి ఒక యువతిని గాఢంగా ప్రేమించాడు. అయితే, వారి ప్రేమ వివాహానికి యువతి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. పెద్దలు తమ ప్రేమను అంగీకరించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన రామ్ కోటి 2003లో ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ప్రియుడి మరణాన్ని తట్టుకోలేక, కొద్ది రోజులకే ఆ యువతి కూడా ఆత్మహత్యకు పాల్పడింది. ఈ రెండు మరణాలు ఆ రెండు కుటుంబాలను తీవ్ర విషాదంలోకి నెట్టాయి.

Telangana Couple Performs Wedding for Dead Son Every Year for 23 Years

కలలోకి వచ్చిన కొడుకు.. ఇంట్లోనే గుడి

యువకుడి మరణంతో లాలు, సుక్కమ్మ దంపతులు పూర్తిగా కుంగిపోయారు. అయితే, చనిపోయిన కొద్దిరోజులకు రామ్ కోటి తన తల్లి సుక్కమ్మ కలలోకి వచ్చాడు. తమ కోసం ఒక గుడి కట్టి, పెళ్లి జరిపించాలని కోరాడట. కొడుకు కోరికను తీర్చాలని నిర్ణయించుకున్న ఆ దంపతులు.. తమ ఇంటి ఆవరణలోనే ఒక చిన్న మందిరాన్ని నిర్మించారు. అందులో తమ కుమారుడు రామ్ కోటి, అతడు ప్రేమించిన యువతి విగ్రహాలను పక్కపక్కనే ప్రతిష్ఠించారు.

శ్రీరామనవమి రోజున కళ్యాణం

అప్పటినుంచి గత 23 ఏళ్లుగా.. ప్రతి ఏటా శ్రీరామనవమి పండుగ నాడు ఈ రెండు విగ్రహాలకు వారు సాంప్రదాయబద్ధంగా వివాహం జరిపిస్తున్నారు. తెలంగాణలో శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణాన్ని భక్తులు ఎంత భక్తిశ్రద్ధలతో జరిపిస్తారో.. అదే స్ఫూర్తితో తమ కొడుకు, కోడలి విగ్రహాలను దైవ సమానంగా భావిస్తూ పూజలు, ఆచార వ్యవహారాలతో పెళ్లి తంతు ముగిస్తున్నారు.

Telangana Couple Performs Wedding for Dead Son Every Year for 23 Years

గ్రామస్తుల మద్దతు

ప్రారంభంలో కేవలం తమ కుమారుడి జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు మాత్రమే నిర్వహించిన ఈ కార్యక్రమం.. కాలక్రమేణా ఆ గ్రామంలో ఒక ఆచారంగా మారిపోయింది. ఇప్పుడు ప్రతి ఏటా శ్రీరామనవమి రోజున నిర్వహించే ఈ పెళ్లి వేడుకను చూసేందుకు, ప్రార్థనల్లో పాల్గొనేందుకు బంధువులతో పాటు గ్రామస్తులు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తుండటం విశేషం.

Advertisement

తాజావార్తలు

Advertisement