Indiramma Atmiya Bharosa | ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్దిదారులు 83 వేలు.. ఆర్థిక సాయం రూ. 5033.22 లక్షలు
Indiramma Atmiya Bharosa | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రధానంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలుపై గత అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్రావు, సునీతా లక్ష్మారెడ్డి, అనిల్ జాదవ్ కలిసి సంబంధిత శాఖా మంత్రిని ప్రశ్నించారు. ఈ పథకం అమలుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేవనెత్తిన ప్రశ్నలకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ రాతపూర్వకంగా సమాధానం ఇచ్చింది.
Indiramma Atmiya Bharosa | త్రినేత్ర.న్యూస్ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రధానంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలుపై గత అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్రావు, సునీతా లక్ష్మారెడ్డి, అనిల్ జాదవ్ కలిసి సంబంధిత శాఖా మంత్రిని ప్రశ్నించారు. ఈ పథకం అమలుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేవనెత్తిన ప్రశ్నలకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ రాతపూర్వకంగా సమాధానం ఇచ్చింది.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని గతేడాది జనవరి 26 నుంచి అమలు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ పథకం కింద భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబానికి ఏడాదికి రూ. 12 వేల చొప్పున ఆర్థిక సహాయం అందింస్తున్నట్లు తెలిపింది. ఈ పథకం కింద ఇప్పటి వరకు రూ. 5033.22 లక్షలు అందజేసినట్లు వెల్లడించింది.
అర్హులు వీరే.. డీబీటీ పద్ధతిలో నిధులు జమ
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నమోదు చేయబడి.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 రోజులు పని చేసిన భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలను ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి అర్హులుగా నిర్ధారించాం. ఆ అర్హత గల కుటుంబానికి రెండు విడుతలుగా, ఒక్కో విడత కింద రూ. 6 వేల చొప్పున ఏడాదికి రూ. 12 వేలు ఆర్థిక సాయం చేస్తున్నామని స్పష్టం చేసింది. డీబీటీ పద్ధతిలో నిధులు జమ చేస్తున్నట్లు పేర్కొంది.
ఈ పథకం అమలు పర్యవేక్షణ రాష్ట్ర స్థాయిలో పంచాయతీ రాజ్ కమిషనర్, గ్రామీణాభివృద్ధి శాఖ నోడల్ డిపార్ట్మెంట్గా వ్యవహరిస్తుంది. జిల్లాల్లో జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు. జిల్లా కలెక్టర్లు తమ జిల్లాలకు సంబంధించిన పథకం అమలు, ఫిర్యాదుల పరిష్కారం కోసం బాధ్యులుగా ఉంటారని వివరించడం జరిగింది.
దరఖాస్తులు 8 లక్షలు.. లబ్ధిదారులు 83 వేలు..
ఈ పథకం కోసం గ్రామసభల్లో 8,30,302 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ దరఖాస్తులను పరిశీలించగా, అర్హులుగా 5,14,705 మంది ఎంపికయ్యారు. మొత్తంగా 83,887 మంది లబ్ది పొందినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ వెల్లడించింది.

ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Baby Girl | 200 ఏళ్ల తర్వాత.. ఆ ఇంట ఆడబిడ్డ జననం
- ●Mokila | మోకిలా, బాచుపల్లిలో.. ఒక్కో ప్లాట్ ధర ఎంతో తెలుసా?
- ●Telangana | దక్షిణ కొరియాలో తెలంగాణ ఉన్నతస్థాయి అధికారుల బృందం పర్యటన
- ●వైన్, విస్కీల సీక్రెట్ బాక్స్: అసలు ఈ 'ఓక్' మ్యాజిక్ ఏంటి భయ్యా?
- ●Vemula Prashanth Reddy | కాంగ్రెస్ పాలన 1,000 అబద్ధాల 'దగాపాలన'
- ●Toxic Movie | ముగ్గురు భామలకు ‘టాక్సిక్’.. యశ్ సినిమాతో తలకిందులైన అంచనాలు..!

Baby Girl | 200 ఏళ్ల తర్వాత.. ఆ ఇంట ఆడబిడ్డ జననం

Mokila | మోకిలా, బాచుపల్లిలో.. ఒక్కో ప్లాట్ ధర ఎంతో తెలుసా?

Telangana | దక్షిణ కొరియాలో తెలంగాణ ఉన్నతస్థాయి అధికారుల బృందం పర్యటన

వైన్, విస్కీల సీక్రెట్ బాక్స్: అసలు ఈ 'ఓక్' మ్యాజిక్ ఏంటి భయ్యా?



