త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dasoju Sravan Slams CM Revanth Reddy | తెలంగాణలో ‘యోగి’ పాలన.. రాహుల్ గాంధీ చట్టానికే రేవంత్ రెడ్డి తూట్లు: ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ నిప్పులు!

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్ పాలన సాగిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. రాహుల్ గాంధీ తీసుకొచ్చిన భూసేకరణ చట్టాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఆయన ఆరోపించారు.

J

Telangana | Published On Mar 7, 2026, 10.02 pm IST

Dasoju Sravan Slams CM Revanth Reddy | తెలంగాణలో ‘యోగి’ పాలన.. రాహుల్ గాంధీ చట్టానికే రేవంత్ రెడ్డి తూట్లు: ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ నిప్పులు!

సంక్షిప్త సారాంశం

సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో జరిగిన ‘మూసీ తీరాన బస్తీ పోరాటం’ రౌండ్ టేబుల్ సమావేశంలో దాసోజు శ్రవణ్ పాల్గొన్నారు. మూసీ ప్రాజెక్టు పేరుతో పేదల ఇళ్లను అక్రమంగా కూల్చివేస్తున్నారని, ఇది యూపీలోని యోగి ప్రభుత్వం తరహా 'బుల్డోజర్ పాలన' అని ఆయన విమర్శించారు. కనీసం డీపీఆర్ (DPR) లేకుండా, నోటీసులు ఇవ్వకుండా ఇళ్లు కూల్చడం చట్టవిరుద్ధమని, ఈ ప్రాజెక్టు వెనుక భారీ దోపిడీ దాగి ఉందని ఆయన ఆరోపించారు.

Advertisement

Dasoju Sravan Slams CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పాలిట రాక్షస పాలన సాగిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన “మూసీ తీరాన బస్తీ పోరాటం” రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని, రేవంత్ రెడ్డి సర్కార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం చేసే బుల్డోజర్ పాలనను విమర్శించే కాంగ్రెస్, ఇక్కడ అదే పని చేస్తోందని ఎద్దేవా చేశారు.

రాహుల్ గాంధీ చట్టాన్ని తుంగలో తొక్కారు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూసేకరణ చట్టం–2013 (Land Acquisition Act–2013) కు విరుద్ధంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని శ్రవణ్ ఆరోపించారు. "పేదల హక్కులను రక్షించేందుకు రాహుల్ గాంధీ చట్టం తెస్తే.. అదే పార్టీకి చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆ చట్టంపై కనీస అవగాహన లేదు. డీపీఆర్ (DPR) లేకుండా, సరైన నోటీసులు ఇవ్వకుండా ఇళ్లను కూల్చివేయడం ఏ చట్టంలో ఉంది?" అని ఆయన ప్రశ్నించారు.

మూసీ ప్రాజెక్ట్: లక్ష కోట్ల దోపిడీకి స్కెచ్?

రాష్ట్రంలో పెన్షన్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, కాంట్రాక్టర్ల బిల్లులకు పైసలు లేవని చెబుతున్న ప్రభుత్వం.. మూసీ ప్రాజెక్టు కోసం వేల కోట్లు ఎక్కడి నుంచి తెస్తోందని దాసోజు నిలదీశారు. ఈ ప్రాజెక్టును అదానీ, అంబానీలకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందని, కమిషన్ల కోసమే బస్తీ ప్రజలను ముంచుతున్నారని మండిపడ్డారు. గాంధీ విగ్రహం పేరుతో దందాలు చేస్తున్నారని, అదే సమయంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని తాళం వేసి బంధించడం వారి అహంకారానికి నిదర్శనమని విమర్శించారు.

"అందుకోరా గుతుపందుకో..." - కాంగ్రెస్‌పై పాటతో విమర్శలు

ప్రభుత్వ తీరును ఎండగడుతూ “అందుకోరా గుతుపందుకో… ఈ దొంగలను తరిమేదందుకు” అంటూ ఆయన తీవ్రంగా విమర్శించారు. దున్నపోతు మీద వాన పడితే ఎలా ఉంటుందో కాంగ్రెస్ తీరు అలానే ఉందని వ్యాఖ్యానించారు. బస్తీ ప్రజల ఓట్లతో గెలిచి, ఇప్పుడు వారికే సున్నం పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజలే బుద్ధి చెబుతారు

చట్టపరమైన ప్రక్రియలు పాటించకుండా ఇష్టారాజ్యంగా ఇళ్లను కూల్చివేస్తున్నారని, ఈ రాక్షస పాలనకు ప్రజలే త్వరలో చరమగీతం పాడుతారని హెచ్చరించారు. బస్తీ వాసుల కన్నీళ్లు ఊరికే పోవని, ప్రభుత్వ అహంకారానికి ప్రజలే గట్టి సమాధానం చెబుతారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ స్పష్టం చేశారు. మూసీ బాధితుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని, పేదల ఇళ్లపై బుల్డోజర్లు నడిపితే చూస్తూ ఊరుకోబోమని దాసోజు శ్రవణ్ హెచ్చరించారు.

Advertisement
Advertisement