త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PJTAU | 27 నుంచి అగ్రిక‌ల్చ‌ర్ కోర్సుల‌కు కౌన్సెలింగ్

PJTAU | ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ తెలంగాణ అగ్రిక‌ల్చ‌ర్ యూనివ‌ర్సిటీ ప‌రిధిలోని 13 కాలేజీల్లో డిగ్రీ కోర్సుల భ‌ర్తీకి 27 నుంచి మూడు రోజుల పాటు కౌన్సెలింగ్ నిర్వ‌హిస్తున్న‌ట్లు వీసీ అల్దాస్ జాన‌య్య వెల్ల‌డించారు.

S

Telangana | Published On Aug 26, 2026, 7.59 pm IST

PJTAU | 27 నుంచి అగ్రిక‌ల్చ‌ర్ కోర్సుల‌కు కౌన్సెలింగ్
Advertisement

PJTAU | త్రినేత్ర‌.న్యూస్ : ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ తెలంగాణ అగ్రిక‌ల్చ‌ర్ యూనివ‌ర్సిటీ ప‌రిధిలోని 13 కాలేజీల్లో డిగ్రీ కోర్సుల భ‌ర్తీకి 27 నుంచి మూడు రోజుల పాటు కౌన్సెలింగ్ నిర్వ‌హిస్తున్న‌ట్లు వీసీ అల్దాస్ జాన‌య్య వెల్ల‌డించారు. బీఎస్సీ(ఆనర్స్‌)అగ్రికల్చర్‌, బీఎస్సీ(ఆనర్స్‌) హార్టికల్చర్‌, బీటెక్‌(ఫుడ్‌ టెక్నాలజీ) కోర్సుల్లో ప్ర‌వేశాలు క‌ల్పించ‌నున్న‌ట్లు పేర్కొన్నారు. ఈ కౌన్సెలింగ్ ప్ర‌క్రియ రాజేంద్రనగర్‌లోని విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో గురువారం ఉదయం ప్రారంభం కానున్నది. త‌దిత‌ర వివరాలకు www.pjtau.edu.inలో చూడాలని వర్సిటీ అధికారులు సూచించారు.

Advertisement
Advertisement