త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy | సాధారణ ట్రాఫిక్‌లోనే ముఖ్యమంత్రి రేవంత్ కాన్వాయ్

Revanth Reddy | ఢిల్లీ నుంచి హైద‌రాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy).. శంషాబాద్ విమానాశ్రయం నుంచి తన నివాసం వరకు సాధారణ ట్రాఫిక్‌లోనే పయనించారు. తన కాన్వాయ్ (CM Convoy) కోసం న‌గ‌రంలో వాహనాలను నిలిపివేయడంపై పోలీస్ ఉన్నతాధికారులకు సీఎం స్పష్టమైన ఆదేశాలిచ్చిన విష‌యం తెలిసిందే.

G

Telangana | Published On May 7, 2026, 2.52 pm IST

Revanth Reddy | సాధారణ ట్రాఫిక్‌లోనే ముఖ్యమంత్రి రేవంత్ కాన్వాయ్
Advertisement

Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: ఢిల్లీ నుంచి హైద‌రాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy).. శంషాబాద్ విమానాశ్రయం నుంచి తన నివాసం వరకు సాధారణ ట్రాఫిక్‌లోనే పయనించారు. తన కాన్వాయ్ (CM Convoy) కోసం న‌గ‌రంలో వాహనాలను నిలిపివేయడంపై పోలీస్ ఉన్నతాధికారులకు సీఎం స్పష్టమైన ఆదేశాలిచ్చిన విష‌యం తెలిసిందే. రోడ్లపై ప్రజలకు ఇబ్బందులు కలిగించే చర్యలను పూర్తిగా నివారించాలని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కాన్వాయ్ వెళ్లే సమయంలో ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేయకుండా సింగిల్ లైన్‌లో వాహనాలను ట్రాఫిక్ పోలీసులు అనుమతించారు.

బుధవారం (మే 6న‌) ఉదయం 10 గంటల సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్‌లోని తన ఇంటి నుంచి బయలుదేరారు. గచ్చిబౌలిలోని శిల్పా లేఅవుట్‌ ఫ్లైఓవర్‌ పైనుంచి ప్రయాణిస్తున్న క్రమంలో అవతలివైపు సైతం వాహనాలను ఆపివేసిన విషయాన్ని సీఎం గుర్తించారు. తన కాన్వాయ్‌ వెళ్లే మార్గంలో వాహనాలను ఆపడంతోనే ట్రాఫిక్‌ రద్దీ నెలకొనగా.. అవతలివైపు సైతం ట్రాఫిక్‌ను ఆపేయడాన్ని తీవ్రంగా పరిగణించారు. తాను సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తొలినాళ్లలోనే తన కాన్వాయ్‌ గురించి సాధారణ ప్రజల రాకపోకలను ఎక్కువసేపు ఆపి ఇబ్బందులకు గురిచేయొద్దని ఆదేశించారు. ఇతర వాహనదారుల ఇబ్బందుల్ని వీలైనంతమేర తగ్గించేలా ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేశారు. దీనికితోడు కొద్దిరోజుల క్రితం బాహ్యవలయ రహదారిపై సీఎం కాన్వాయ్‌ ప్రయాణించిన సమయంలో రాకపోకల్ని నియంత్రించడంతో వాహనదారులు ట్రాఫిక్‌ పోలీసులతో వాగ్వాదానికి దిగడం.. ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ నేపథ్యంలోనే బుధవారం తన కాన్వాయ్‌ మార్గంలో కాకుండా అవతలివైపు సైతం వాహనాల్ని నిలిపివేయడంతో సీఎం అసహనానికి గురయ్యారు. వెంటనే డీజీపీ సీవీ ఆనంద్‌కు ఫోన్‌చేసి స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. తన కాన్వాయ్‌ కోసం సాధారణ ప్రజలను గంటల తరబడి రోడ్లపై నిలపవద్దని.. అలాంటి చర్యలు పునరావృతమైతే సంబంధిత అధికారులపై కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

[video width="848" height="478" mp4="https://www.trinethra.news/static-media/wp-content/uploads/2026/05/WhatsApp-Video-2026-05-07-at-2.18.26-PM.mp4"][/video]

Advertisement
Advertisement