త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Cheyutha Pensions | అక్ర‌మాల‌కు అడ్డుక‌ట్ట‌.. ల‌బ్ధిదారుల ఖాతాల్లోనే ‘చేయూత’ పెన్ష‌న్లు జ‌మ‌..!

Cheyutha Pensions | రాష్ట్రంలోని 42 ల‌క్ష‌ల మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత‌, గీత కార్మికుల‌కు చేయూత ప‌థ‌కం కింద పెన్ష‌న్లు ఇస్తున్న సంగ‌తి తెలిసిందే.

S

Telangana | Published On Jun 4, 2026, 6.32 am IST

Cheyutha Pensions | అక్ర‌మాల‌కు అడ్డుక‌ట్ట‌.. ల‌బ్ధిదారుల ఖాతాల్లోనే ‘చేయూత’ పెన్ష‌న్లు జ‌మ‌..!
Advertisement

Cheyutha Pensions | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలోని 42 ల‌క్ష‌ల మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత‌, గీత కార్మికుల‌కు చేయూత ప‌థ‌కం కింద పెన్ష‌న్లు ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ ప‌థ‌కంలో పెద్ద ఎత్తున అక్ర‌మాలు చోటు చేసుకుంటున్నాయ‌ని ల‌బ్ధిదారులు స‌ద‌రు అధికారుల‌కు భారీగా ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో న‌గ‌దు చెల్లింపులు చేయ‌కుండా, నేరుగా ల‌బ్ధిదారుల ఖాతాలో జ‌మ చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. దీంతో ల‌బ్ధిదారుల‌కు ఎంతో మేలు జ‌ర‌గ‌నుంది. అక్ర‌మాలకు ఆస్కార‌మే లేకుండా పోతుంద‌ని అధికారులు నిర్ణ‌యించారు.

అయితే చేయూత పెన్ష‌న్లు పొందుతున్న కొంద‌రికి నేరుగా బ్యాంకు ఖాతాలోనే సొమ్ము జ‌మ అవుతుంది. కానీ కొంత మంది ల‌బ్ధిదారుల‌కు పంచాయ‌తీ కార్య‌ద‌ర్శులు, బిల్ క‌లెక్ట‌ర్లు పెన్ష‌న్ల‌ను అందిస్తున్నారు. ఈ న‌గ‌దు చెల్లింపుల్లో అక్ర‌మాలు జ‌రుగుతున్న‌ట్లు ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే అన్ని పింఛన్లు లబ్ధిదారుల ఖాతాల్లోనే జమ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించడంతో రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్‌) ఆ దిశగా సన్నాహాలు ప్రారంభించింది. నగదు తీసుకుంటున్న వారికి కొత్తగా పోస్టల్‌ బ్యాంకు ఖాతాలు తెరిచి జమ చేయాలని నిర్ణయించింది. వీటిలో జమయ్యే సొమ్మును లబ్ధిదారులు తమకు అవసరమైనప్పుడు నేరుగా లేదంటే ఏటీఎంల ద్వారా తీసుకోవచ్చు. ప్రస్తుతం లైవ్‌ అథెంటికేషన్‌ పేరిట లబ్ధిదారుల నిర్ధారణ కార్యక్రమం జరుగుతోంది. జూన్‌ నెలాఖరులోగా ఈ ప్రక్రియ పూర్తవుతుందని, ఆగస్టు నుంచి పింఛను మొత్తాలు నేరుగా బ్యాంకు ఖాతాలకు జమ చేసే అవకాశముందని సమాచారం.

Advertisement
Advertisement