త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Cheyutha Pensions | చేయూత పెన్ష‌న్ల ద‌ర‌ఖాస్తు గ‌డువు పొడిగింపు.. ఎప్ప‌టి వ‌ర‌కు అంటే..?

Cheyutha Pensions | రాష్ట్రంలో అర్హులైన వారంద‌రికీ చేయూత పెన్ష‌న్లు అంద‌జేస్తామ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ల‌బ్ధిదారులు భారీగా ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు.

S

Telangana | Published On Aug 31, 2026, 9.21 pm IST

Cheyutha Pensions | చేయూత పెన్ష‌న్ల ద‌ర‌ఖాస్తు గ‌డువు పొడిగింపు.. ఎప్ప‌టి వ‌ర‌కు అంటే..?
Advertisement

Cheyutha Pensions | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలో అర్హులైన వారంద‌రికీ చేయూత పెన్ష‌న్లు అంద‌జేస్తామ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ల‌బ్ధిదారులు భారీగా ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. సోమ‌వారంతో ఈ పెన్ష‌న్ల ద‌ర‌ఖాస్తు ముగియ‌డంతో.. ల‌బ్దిదారుల అభ్య‌ర్థ‌న‌ల మేర‌కు సెప్టెంబ‌ర్ 15వ తేదీ వ‌ర‌కు గడువు పొడిగిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రంలో కొత్త‌గా 2.50 ల‌క్ష‌ల మందికి కొత్త పెన్ష‌న్లు ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే.

ఆదివారం నాటికి 4.34 ల‌క్ష‌ల ద‌ర‌ఖాస్తులు.. అత్య‌ధికులు వితంతువులే

ఆదివారం వరకు మొత్తం 4.34 లక్షల మంది తమ పేర్లను నమోదు చేసుకోగా.. ఇందులో అత్యధికంగా 2.64 లక్షల మంది వితంతువులు దరఖాస్తులు ఇచ్చారు. 26,057 మంది ఒంటరి మహిళలు, 1,07,171 మంది దివ్యాంగులు, 26,343 మంది గీత కార్మికులు, 10,468 మంది చేనేత కార్మికులున్నారు. హైదరాబాద్‌ జిల్లాలో అత్యధికంగా 27,554 మంది, అత్యల్పంగా ములుగు నుంచి 3,620 మంది దరఖాస్తులు సమర్పించారు.

Advertisement
Advertisement