త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | 2027లో క‌చ్చితంగా పాద‌యాత్ర చేస్తా.. ఆ లోపు ఫిట్ అవుతా : కేటీఆర్

KTR | రాబోయే అసెంబ్లీ ఎన్నిక‌లను దృష్టిలో ఉంచుకుని 2027 ఏడాదిలో క‌చ్చితంగా పాద‌యాత్ర చేస్తాన‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

S

Telangana | Published On Jun 3, 2026, 3.48 pm IST

KTR | 2027లో క‌చ్చితంగా పాద‌యాత్ర చేస్తా.. ఆ లోపు ఫిట్ అవుతా : కేటీఆర్
Advertisement

KTR | త్రినేత్ర‌.న్యూస్ : రాబోయే అసెంబ్లీ ఎన్నిక‌లను దృష్టిలో ఉంచుకుని 2027 ఏడాదిలో క‌చ్చితంగా పాద‌యాత్ర చేస్తాన‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఓ మీడియా ప్ర‌తినిధి అడిగిన ప్ర‌శ్న‌కు కేటీఆర్ బ‌దులిచ్చారు.

వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తా. ఎప్పుడు అనేది పార్టీ నిర్ణయిస్తుంది. 2027లో కచ్చితంగా పాదయాత్ర ఉంటుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి, ఏ టైమ్‌లో పాదయాత్ర చేయాలనే దానిపై పార్టీలో పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. పాదయాత్ర మొదలయ్యేలోపు నీలాగా ఫిట్‌ అవ్వాలని చూస్తున్నానని స‌ద‌రు జ‌ర్న‌లిస్టును ఉద్దేశించి కేటీఆర్ చమత్కరించారు.

మా పార్టీ గుర్తు కారు.. ఎప్పుడు గేర్ మార్చాలో మాకు తెలుసు

మా పార్టీ గుర్తు కారు.. ఎప్పుడు గేర్ మార్చాలో మాకు తెలుసు అని మరో ప్రశ్నకు కేటీఆర్ సమాధానమిచ్చారు. మా నాయకత్వం, మా పార్టీ, మా సర్ తయారు చేసిన నాయకులు చాలు రేవంత్ రెడ్డి స్థాయికి అని తెలిపారు. కేసీఆర్ ఇప్పుడే అవసరం లేదని అన్నారు. ఆయన మా తురుపు ముక్క.. ఆయన ఎప్పుడు రావాలో.. ఎలా రావాలో.. ఏం చేయాలో.. ఆయన నిర్ణయించుకుంటారని అన్నారు. ఆయన టైమ్‌కు ఆయన వస్తారని అన్నారు. ఆయన తెలంగాణ ఓజీ అని అన్నారు.

Advertisement
Advertisement