త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | ఢిల్లీలో నాట‌కాలు ఎందుకు రాహుల్ జీ..? కేటీఆర్ ఫైర్

KTR | లోక్‌‌‌‌‌‌‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శుక్రవారం ఢిల్లీలోని బెంగాలీ మార్కెట్ ఏరియాకు చెందిన ఆటో డ్రైవర్లను కలిసి వారితో లంచ్ పే చ‌ర్చ నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదిక‌గా స్పందించారు.

S

Telangana | Published On May 31, 2026, 9.33 am IST

KTR | ఢిల్లీలో నాట‌కాలు ఎందుకు రాహుల్ జీ..? కేటీఆర్ ఫైర్
Advertisement

KTR | త్రినేత్ర‌.న్యూస్ : లోక్‌‌‌‌‌‌‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శుక్రవారం ఢిల్లీలోని బెంగాలీ మార్కెట్ ఏరియాకు చెందిన ఆటో డ్రైవర్లను కలిసి వారితో లంచ్ పే చ‌ర్చ నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదిక‌గా స్పందించారు.

ఢిల్లీలో ఆటో డ్రైవ‌ర్ల విష‌యంలో పెద్ద పెద్ద వాగ్దానాలు చేసే ముందు.. 2023లో తెలంగాణ ఆటో డ్రైవ‌ర్ల‌కు మీరిచ్చిన వాగ్దానాల అమ‌లు ఏమైందో వివ‌రిస్తారా..? అని రాహుల్ గాంధీని కేటీఆర్ నిల‌దీశారు. తెలంగాణ‌లో ఆటో డ్రైవ‌ర్ల కోసం ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామ‌ని, అలాగే ప్ర‌తి డ్రైవ‌ర్‌కు ఏడాదికి రూ. 12 వేలు ఇస్తామ‌ని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి 30 నెల‌లు గ‌డుస్తున్నా.. ఇప్ప‌టికీ ఆ హామీ నెర‌వేర‌లేదు. రేవంత్ స‌ర్కార్ అధికారంలోకి వ‌చ్చాక 100 మంది ఆటో డ్రైవ‌ర్లకు పైగా ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. మూడేళ్ల క్రితం తెలంగాణ ఆటో డ్రైవర్లకు చేసిన వాగ్దానాలు ఇంకా పెండింగ్‌లో ఉండగా, ఢిల్లీలో ఈ నాటకం ఎందుకు? అని రాహుల్ గాంధీపై కేటీఆర్ నిప్పులు చెరిగారు.

Advertisement
Advertisement