త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

AI Water Consumption | ఏఐ సూపర్ పవర్ కావాలంటే.. నీటిని త్యాగం చేయాల్సిందేనా? భయపెడుతున్న కొత్త రిపోర్ట్!

మీరు ఏఐ (AI) కి ఇచ్చే ప్రతి ప్రాంప్ట్ దేశంలో నీటిని ఆవిరి చేస్తోంది. 2030 నాటికి డేటా సెంటర్ల వల్ల ఇండియాలో భారీ నీటి సంక్షోభం రానుందని రిపోర్టులు చెబుతున్నాయి.

J

Technology | Published On Jun 15, 2026, 3.00 am IST

AI Water Consumption | ఏఐ సూపర్ పవర్ కావాలంటే.. నీటిని త్యాగం చేయాల్సిందేనా? భయపెడుతున్న కొత్త రిపోర్ట్!

సంక్షిప్త సారాంశం

కృత్రిమ మేధ (AI) విస్తరణతో భారత్‌లో డేటా సెంటర్ల నీటి వాడకం భారీగా పెరుగుతోంది.  CEEW రిపోర్ట్ ప్రకారం, 2024-25లో భారత డేటా సెంటర్లు ఏకంగా 150 బిలియన్ లీటర్ల నీటిని వాడేశాయి. 2030 నాటికి ఇది 358 బిలియన్ లీటర్లకు చేరుతుందని అంచనా.  ఒక్క ChatGPT-4 మోడల్ ట్రైనింగ్ కోసమే దాదాపు 592 మిలియన్ లీటర్ల (59.2 కోట్లు) నీరు ఖర్చయింది.  ఇప్పటికే నీటి కొరతను ఎదుర్కొంటున్న హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి నగరాల్లోనే ఈ డేటా సెంటర్లు ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

Advertisement

AI Water Consumption | త్రినేత్ర.న్యూస్ : కృత్రిమ మేధ (Artificial Intelligence - AI) నేటి సాంకేతిక ప్రపంచాన్ని శాసిస్తోంది. ఈ రంగంలో గ్లోబల్ సూపర్ పవర్‌గా ఎదగాలని భారత్ (India) ఎంతో ఆశగా అడుగులు వేస్తోంది. ఈమెయిల్స్ రాయడం దగ్గరి నుంచి.. ఇమేజ్‌లు క్రియేట్ చేయడం, డీప్ రీసెర్చ్ చేయడం వరకు ఏఐ మన దైనందిన జీవితంలో భాగమైపోయింది. కానీ, ఈ అద్భుతమైన టెక్నాలజీ వెనుక ఒక భయంకరమైన నిజం దాగి ఉంది. మనం వాడే ప్రతి ఏఐ ఫీచర్ వెనుక కరెంటు, భూమి, మినరల్స్‌తో పాటు అమూల్యమైన నీరు (Water) కూడా ఖర్చవుతోంది. ఈ ఏఐ టెక్నాలజీ వల్ల ముంచుకొస్తున్న పర్యావరణ ముప్పు గురించి ఐక్యరాజ్యసమితికి చెందిన UNU-INWEH తాజా నివేదిక తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.

ఏఐ (AI) కి నీరు ఎందుకు కావాలి?

మీరు ఏఐ చాట్‌బాట్‌ (Chatbot) లో ఒక ప్రశ్న (Prompt) అడిగిన వెంటనే, ఆ సమాచారం కోసం డేటా సెంటర్ (Data centre) లోని సర్వర్లు (Servers) వేగంగా పనిచేస్తాయి. ఇలా లక్షలాది మంది ప్రాంప్ట్స్ ఇస్తున్నప్పుడు డేటా సెంటర్లలో భారీ స్థాయిలో వేడి పుడుతుంది. ఆ సర్వర్లు కాలిపోకుండా.. నిరంతరం పనిచేసేలా ఉంచడానికి 'కూలింగ్ సిస్టమ్స్' (Cooling systems) వాడతారు.

The Hidden Cost of AI in India A Looming Water Crisis

ఈ ఎవాపరేటివ్ కూలింగ్ ప్రక్రియలో సర్వర్ల వేడిని గ్రహించిన నీరు.. ఆవిరి రూపంలో వాతావరణంలోకి వెళ్లిపోతుంది. ఇలా ఏఐ మోడల్స్ పెద్దవవుతున్న కొద్దీ వాటికి కూలింగ్ అవసరం కూడా అమాంతం పెరుగుతోంది. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం.. ఒక్క ChatGPT-4 మోడల్‌కు ట్రైనింగ్ ఇవ్వడానికే సుమారు 592 మిలియన్ లీటర్ల (59.2 కోట్లు) నీరు అవసరమైందని అంచనా.

ఇండియాలో పరిస్థితి ఏంటి?

కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్‌మెంట్ అండ్ వాటర్ (CEEW) నివేదిక ప్రకారం ఒక సాధారణ 100-మెగావాట్ల (MW) హైపర్‌స్కేల్ డేటా సెంటర్ కేవలం కూలింగ్ కోసమే రోజుకు సుమారు 20 లక్షల లీటర్ల నీటిని వినియోగిస్తుంది. డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతున్న కొద్దీ భారత్‌లో నీటి వాడకం భారీగా పెరుగుతోంది.

2024-2025: మన డేటా సెంటర్లు దాదాపు 150 బిలియన్ లీటర్ల నీటిని వినియోగించాయి.

2030 నాటికి అంచనా: ఈ వాడకం ఏకంగా 358 బిలియన్ లీటర్లకు చేరుకోనుంది.

గూగుల్ (Google), మైక్రోసాఫ్ట్ (Microsoft), అమెజాన్, మెటా లాంటి గ్లోబల్ టెక్ దిగ్గజాలతో పాటు దేశీయ సంస్థలు కూడా భారత్‌లో డేటా సెంటర్ల కోసం బిలియన్ల కొద్దీ డాలర్లు పెట్టుబడి పెడుతున్నాయి. 2020లో 375 MW గా ఉన్న మన డేటా సెంటర్ల సామర్థ్యం.. 2025 నాటికి 1500 MW కు చేరింది. ఈ దశాబ్దం చివరకి ఇది 8,000 నుంచి 10,000 MW కు చేరొచ్చని అంచనా.

The Hidden Cost of AI in India A Looming Water Crisis

నీటి కొరత ఉన్న నగరాల్లోనే డేటా సెంటర్లు!

భారత్‌లో డేటా సెంటర్లు ఎంత నీటిని తాగుతున్నాయి అన్నదాని కంటే.. వాటిని ఎక్కడ నిర్మిస్తున్నారు అన్నదే అసలు సమస్య. CEEW నివేదిక ప్రకారం భారతదేశంలోని 65% పైగా డేటా సెంటర్లు ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, నోయిడా ప్రాంతాల్లోనే కేంద్రీకృతమై ఉన్నాయి. ఈ నగరాలు ఇప్పటికే తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి.

బెంగళూరు (2024): గ్రౌండ్‌వాటర్ తగ్గిపోయి నగరం ఎంతలా అల్లాడిపోయిందో మనం చూశాం.

చెన్నై (2019): 'డే జీరో' (Day Zero) పరిస్థితులు తలెత్తి చుక్క నీటికి కటకటలాడింది.

The Hidden Cost of AI in India A Looming Water Crisis

 

హైదరాబాద్: భవిష్యత్తులో ఇక్కడ తీవ్రమైన నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉందని అంచనాలు ఉన్నాయి.

క్లైమేట్ చేంజ్ (Climate change) వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతుంటే, మరోవైపు ఈ డేటా సెంటర్లను చల్లబరచడానికి మరింత నీరు అవసరం అవుతుంది.

పరిష్కారం ఏంటి?

పరిస్థితి చేయి దాటిపోకముందే మేల్కుంటే దీనికి పరిష్కారం ఉందని నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తులో నిర్మించే డేటా సెంటర్ల కూలింగ్ సిస్టమ్స్ కోసం స్వచ్ఛమైన మంచినీటిని (Freshwater) వాడకుండా.. ట్రీట్ చేసిన మురుగునీరు (Treated wastewater), సముద్రపు నీరు లేదా క్లోజ్డ్-లూప్ లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీలను వాడాలి. డేటా సెంటర్లను ఎక్కడ పడితే అక్కడ కాకుండా.. నీటి లభ్యత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో (Site selection) ఏర్పాటు చేయాలి.

The Hidden Cost of AI in India A Looming Water Crisis

 

ఏఐ (AI) నీటిని తాగుతుందా లేదా అన్నది ఇక ప్రశ్న కాదు.. అది మన భవిష్యత్ అవసరాలను ఎంతమేర మింగేస్తుంది, దానికి మనం చెల్లించబోయే మూల్యం ఏంటి అన్నదే ఇప్పుడు మన ముందున్న అతిపెద్ద సవాలు!

 

Advertisement
Advertisement