త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Iran Women Football Team | మైదానంలో ఇరాన్ మహిళల ధిక్కారం.. జాతీయ గీతం పాడకుండా సంచలనం!

వుమెన్స్ ఏషియన్ కప్ టోర్నీలో భాగంగా దక్షిణ కొరియాతో జరిగిన మ్యాచ్‌కు ముందు ఇరాన్ మహిళల ఫుట్‌బాల్ జట్టు తమ జాతీయ గీతాన్ని పాడేందుకు నిరాకరించి మౌన పోరాటం (Silent Protest) చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతికి నిరసనగానే క్రీడాకారిణులు ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

J

Sports | Published On Mar 3, 2026, 5.13 pm IST

Iran Women Football Team | మైదానంలో ఇరాన్ మహిళల ధిక్కారం.. జాతీయ గీతం పాడకుండా సంచలనం!

సంక్షిప్త సారాంశం

వుమెన్స్ ఏషియన్ కప్ ప్రారంభ మ్యాచ్‌లో ఇరాన్ జాతీయ మహిళల ఫుట్‌బాల్ జట్టు మౌన నిరసన చేపట్టింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు స్టేడియంలో ఇరాన్ జాతీయ గీతం ప్లే అవుతున్నప్పుడు క్రీడాకారిణులు, కోచ్ ఎవరూ గొంతు కలపకుండా మౌనంగా ఉండిపోయారు. ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ మరణించిన నేపథ్యంలో ఈ నిరసన వ్యక్తమైంది. ఈ మ్యాచ్‌లో ఇరాన్‌పై దక్షిణ కొరియా ఘన విజయం సాధించింది. ఓడినప్పటికీ తమ జట్టు పోరాడిన తీరు పట్ల ఇరాన్ కోచ్ జాఫరీ సంతృప్తి వ్యక్తం చేశారు.

Advertisement

Iran Women Football Team | త్రినేత్ర.న్యూస్ : అగ్రరాజ్యం అమెరికా, ఇజ్రాయెల్‌తో జరుగుతున్న భీకర యుద్ధం నేపథ్యంలో ఇరాన్ మహిళల ఫుట్‌బాల్ జట్టు (Iranian women's national soccer team) సంచలన నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లో ఉన్న సీబస్ సూపర్ స్టేడియంలో (Cbus Super Stadium) జరిగిన వుమెన్స్ ఏషియన్ కప్ (Women's Asian Cup) ప్రారంభ మ్యాచ్‌లో.. తమ జాతీయ గీతాన్ని పాడేందుకు నిరాకరించి మౌనంగా నిరసన (Silent protest) తెలిపింది.

జాతీయ గీతం సమయంలో మౌనంగా..

దక్షిణ కొరియాతో మ్యాచ్‌కు ముందు, క్రీడాకారిణులు మైదానంలో తమ సంప్రదాయం ప్రకారం వరుసలో నిలబడినప్పుడు స్టేడియంలో ఇరాన్ జాతీయ గీతాన్ని ప్లే చేశారు. అయితే, మైదానంలో ఉన్న ఏ ఒక్క ఇరాన్ క్రీడాకారిణి కూడా జాతీయ గీతాన్ని పాడలేదు. హెడ్ కోచ్ మర్జియే జాఫరీ (Marziyeh Jafari) సైతం మౌనంగా ఉండిపోయారు. వీరంతా ఎటువంటి కదలికలు లేకుండా నేరుగా చూస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ (Supreme leader) అయతుల్లా అలీ ఖమేనీ మరణించిన నేపథ్యంలో ఈ మౌన పోరాటం జరగడం గమనార్హం.

ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అడ్డుకున్న అధికారులు

ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఇరాన్ కెప్టెన్ జహ్రా ఘన్‌బరీ (Zahra Ghanbari), కోచ్ జాఫరీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖమేనీ మృతికి సంబంధించి విలేకరులు అడిగిన ప్రశ్నలను ఏఎఫ్‌సీ (AFC) మీడియా ప్రతినిధి అడ్డుకున్నారు. కోచ్ జాఫరీ ఫార్శీ భాషలో బదులిచ్చే ప్రయత్నం చేయగా.. దాన్ని ఇంగ్లీష్‌లోకి అనువదించకుండానే మీడియా ప్రతినిధి అడ్డుకున్నారని ఈఎస్‌పీఎన్ (ESPN) పేర్కొంది. "మీ ప్రశ్నలకు ధన్యవాదాలు.. దయచేసి ఆటపై మాత్రమే దృష్టి పెడదాం" అంటూ ఆ ప్రతినిధి టాపిక్ మార్చేశారు.

ఓడిన ఇరాన్.. ఆకట్టుకున్న పోరాటం

ఈ మ్యాచ్‌లో దక్షిణ కొరియా ఆధిపత్యం చెలాయించింది. తొలి సగంలో చోయ్ యూ-రి, విరామం తర్వాత కిమ్ హే-రి, కో యూ-జిన్ గోల్స్ చేయడంతో దక్షిణ కొరియా విజయం సాధించింది. మ్యాచ్‌లో ఓడినప్పటికీ, తమ జట్టు (Team Melli Banovan) ప్రదర్శన పట్ల కోచ్ జాఫరీ సంతృప్తి వ్యక్తం చేశారు. ఆసియాలోనే అత్యంత బలమైన జట్లలో దక్షిణ కొరియా ఒకటని, నాలుగు సార్లు ఫిఫా వరల్డ్ కప్ ఆడిన అనుభవం వారికి ఉందని ఆమె అన్నారు.

"ఈ మ్యాచ్ కష్టంగా ఉంటుందని మాకు ముందే తెలుసు. వారు చాలా బాగా ఆడారు. ద్వితీయార్థం కోసం మేము ఒక వ్యూహంతో బరిలోకి దిగాము. డిఫెన్స్ నుండి అటాకింగ్ (Offensive) వ్యూహాలకు మారాము. అయితే ఒక పెనాల్టీ, సెట్-పీస్ గోల్ విషయంలో మా ఆటగాళ్లు చేసిన వ్యక్తిగత తప్పిదాల వల్లే గోల్స్ సమర్పించుకున్నాం. కానీ ఓవరాల్‌గా మా జట్టు ప్రదర్శన అద్భుతంగా ఉంది" అని కోచ్ జాఫరీ జట్టును ప్రశంసించారు.

https://x.com/AdityaRajKaul/status/2028730156634832950

 

Advertisement
Advertisement