త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mumbai Delhi Terror Attack | ఢిల్లీ, ముంబైలలో భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. దావూద్, ఐఎస్‌ఐతో లింకులు ఉన్న 9 మంది అరెస్ట్

ఢిల్లీ, ముంబైలలో భారీ ఉగ్రదాడికి కుట్ర పన్నిన 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐఎస్‌ఐ, దావూద్ ఇబ్రహీంతో వీరికి ఉన్న లింకులు, అసలు టార్గెట్స్ ఏంటంటే?

J

National | Published On May 30, 2026, 3.01 pm IST

Mumbai Delhi Terror Attack | ఢిల్లీ, ముంబైలలో భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. దావూద్, ఐఎస్‌ఐతో లింకులు ఉన్న 9 మంది అరెస్ట్
Advertisement
  • ఢిల్లీ, ముంబైలలో ఉగ్రవాద దాడులకు ప్లాన్ చేసిన 9 మంది అనుమానితుల అరెస్ట్
  • పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ 'ISI', అండర్ వరల్డ్ డాన్ 'దావూద్ ఇబ్రహీం'తో వీరికి సంబంధాలు
  • నిందితుల నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం
  • దేశంలోని న్యూక్లియర్ కేంద్రాలు, ఎయిర్‌పోర్టులు, పవర్ ప్లాంట్లే లక్ష్యంగా భారీ కుట్ర

Mumbai Delhi Terror Attack | త్రినేత్ర.న్యూస్ : శనివారం దేశవ్యాప్తంగా ఓ భారీ ఉగ్ర ముప్పు తప్పింది. పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ (ISI), అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో (Dawood Ibrahim) సంబంధాలున్న 9 మంది ఉగ్రవాదులను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ (Delhi Police Special Cell) అధికారులు అరెస్ట్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ముంబై, ఇతర ప్రధాన నగరాల్లో వీరు భారీ దాడులకు కుట్ర పన్నినట్లు అధికారులు వెల్లడించారు.

అరెస్ట్ అయిన వారిలో ఢిల్లీ, ముంబై, పంజాబ్‌కు చెందిన స్థానికులతో పాటు కొందరు విదేశీయులు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

హిట్ లిస్ట్‌లో కీలక స్థావరాలు

దేశంలోని అత్యంత కీలకమైన భద్రతా స్థావరాలపై దాడులు చేయడమే లక్ష్యంగా ఈ ఉగ్ర ముఠా పావులు కదిపింది. న్యూక్లియర్ ఫెసిలిటీస్ (Nuclear facilities), అంతర్జాతీయ విమానాశ్రయాలు, రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లు, పవర్ ప్లాంట్లు వీరి హిట్ లిస్ట్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి పెద్ద ఎత్తున అధునాతన ఆయుధాలు, మందుగుండు సామగ్రిని అధికారులు సీజ్ చేశారు.

గత కొంతకాలంగా ఈ ఉగ్ర మాడ్యూల్‌ కదలికలపై నిఘా ఉంచిన స్పెషల్ సెల్.. పక్కా సమాచారంతో దాడులు చేసి వీరిని అదుపులోకి తీసుకుంది. వీరికి విదేశాల నుంచి ఫండింగ్ (Funding) ఎలా వస్తోంది? సరిహద్దుల ఆవల ఉండి వీరిని ఎవరు ఆపరేట్ చేస్తున్నారు? అనే కోణాల్లో అధికారులు ప్రస్తుతం ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు.

హై అలర్ట్‌లో దేశ రాజధాని

ఆత్మాహుతి దాడులు (Suicide attacks), వాహనాల్లో అమర్చే ఐఈడీ (IED) పేలుళ్లు లేదా భారీ కాల్పుల ద్వారా సెంట్రల్ ఢిల్లీలోని రద్దీ ప్రాంతాలను టార్గెట్ చేసే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు ఈ నెల ప్రారంభంలోనే హెచ్చరించాయి.

ఈ ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్స్ నేపథ్యంలో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. అన్ని జిల్లాల పోలీస్ యూనిట్లు అప్రమత్తంగా ఉండాలని, సెంట్రల్ పారామిలటరీ బలగాలతో (Paramilitary forces) సమన్వయం చేసుకుంటూ భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

గత ఏడాది ఎర్రకోట పేలుడు

గత ఏడాది ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట (Red Fort) సమీపంలో జరిగిన భారీ ఐఈడీ పేలుడులో 15 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసులో ఢిల్లీ సమీపంలోని ఫరీదాబాద్ అల్-ఫలాహ్ యూనివర్సిటీలో పనిచేసే కశ్మీరీ డాక్టర్ ఉమర్-ఉన్-నబీని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ కేసులో కశ్మీర్‌కు చెందిన ముజమ్మిల్ షకీల్ గనాయ్, ఆదిల్ అహ్మద్, ముజాఫర్ అహ్మద్, ముఫ్తీ ఇర్ఫాన్, యూపీకి చెందిన షాహీన్ సయీద్‌లను ప్రధాన నిందితులుగా గుర్తించారు. వీరంతా అల్-ఖైదా అనుబంధ ఉగ్రవాద సంస్థ 'అన్సార్ గజ్వత్-ఉల్-హింద్'తో సంబంధం ఉన్న "వైట్ కాలర్" టెర్రర్ మాడ్యూల్‌గా పోలీసులు తేల్చారు. తాజాగా పట్టుబడిన ఈ 9 మందికి, ఆ పాత నెట్‌వర్క్‌తో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు.

Advertisement
Advertisement