Power Grid Recruitment | పవర్ గ్రిడ్లో 660 ట్రెయినీ పోస్టులు.. దరఖాస్తు చేశారా?
Power Grid Recruitment | పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL) డిప్లొమా ట్రెయినీ, జూనియర్ ఆఫీసర్ ట్రెయినీ, జూనియర్ టెక్నీషియన్ ట్రెయినీ పోస్టులను (Trainee Posts) భర్తీ చేయనుంది. మొత్తం 660 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Power Grid Recruitment) విడుదల చేసింది.
Power Grid Recruitment | త్రినేత్ర.న్యూస్: పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL) డిప్లొమా ట్రెయినీ, జూనియర్ ఆఫీసర్ ట్రెయినీ, జూనియర్ టెక్నీషియన్ ట్రెయినీ పోస్టులను (Trainee Posts) భర్తీ చేయనుంది. మొత్తం 660 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Power Grid Recruitment) విడుదల చేసింది. మే 11 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంజినీరింగ్తో పాటు డిప్లొమా, గ్రాడ్యుయేషన్/ సీఎంఏ, సీఏ, ఐటీఐ చేసిన వారు అర్హలు. రాత పరీక్షతో నియామకాలు ఉంటాయి. నెలకు రూ.24,000 నుంచి 1,08,000 వరకు వేతనం ఉంటుంది. ట్రైనింగ్ తర్వాత నెలకు రూ.25,000 - 1,17,500 చెల్లిస్తారు.
మొత్తం ఖాళీలు- 660
ఇందులో డిప్లొమా ట్రెయినీ ఎలక్ట్రికల్ (DTE), సివిల్ (DTC), సర్వే (DTS), జూనియర్ ఆఫీసర్ ట్రెయినీ హెచ్ఆర్, ఎఫ్ అండ్ ఏ, సర్వే పోస్టులు ఉన్నాయి.
రీజియన్ లేదా ప్రాజెక్టు వారీగా పోస్టులు..
కార్పొరేట్ సెంటర్- 21
ఈస్టర్న్ రీజియన్-I (ER) - 2
ఈస్టర్న్ రీజియన్-II (ER) - 16
ఒడిశా ప్రాజెక్టు- 32
నార్త్ ఈస్టర్న్ రీజియన్- 33
నార్తర్న్ రీజియన్-I (NER)- 92
రాజస్థాన్ ప్రాజెక్ట్- 42
నార్తర్న్ రీజియన్-II (NER)- 50
నార్తర్న్ రీజియన్-III (NER)-45
సౌథర్న్ రీజియన్-I (SR)-47
సౌథర్న్ రీజియన్-II (SR)-81
వెస్టర్న్ రీజియన్-I (WR)-67
వెస్టర్న్ రీజియన్-II (WR)-110
సీటీయూఐఎల్లో ఖాళీలు- 30
డీటీఈ- 16, డీటీసీ 6, జూనియర్ ఆఫీసర్ ట్రైనీ హెచ్ఆర్ 4, జూనియర్ ఆఫీసర్ ట్రెయినీ ఎఫ్ అండ్ ఏ 4
అర్హత : 70 శాతం మార్కులతో ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ (పవర్), ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, పవర్ సిస్టమ్స్, పవర్ ఇంజినీరింగ్ (ఎలక్ట్రికల్) డిప్లొమా, సివిల్ ఇంజినీరింగ్ డిప్లొమా, ఇంటర్ సీఏ/ సీఎంఏ, 60 శాతం మార్కులతో బీబీఏ / బీబీఎం/ బీబీఎస్ చేసి ఉండాలి. బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా, సీఏ, సీఎంఏ పూర్తి చేసినవారికి అవకాశం లేదు. అభ్యర్థులు 18 నుంచి 27 ఏండ్ల మధ్య వయస్కులై ఉండాలి.
ఎంపిక విధానం
- రాత పరీక్ష/ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, కంప్యూటర్ స్కిల్ టెస్టులతో స్కిల్ టెస్టులతో ఉంటుంది.
- పరీక్ష మల్టిపుల్ చాయిస్ విధానంలో 170 మార్కులకు నిర్వహిస్తారు. ప్రశ్నాపత్రం రెండు పార్టులుగా ఉంటుంది.
- పార్ట్-1లో 120 టెక్నికల్ నాలెడ్జ్ ప్రశ్నలు
- పార్ట్-2లో ఆప్టిట్యూడ్ టెస్టు 50 మార్కులకు ఉంటుంది.
- ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. ప్రతి తప్పు సమాధానికీ పావుమార్కు తగ్గిస్తారు.
రాత పరీక్ష లేదా కంప్యూటర్ బేస్డ్ టెస్టులో జనరల్ అభ్యర్థులు 40 శాతం, ప్రత్యేక వర్గాలకు చెందిన వారు 30 శాతం మార్కులు సాధించాలి. అందులో 1:5 నిష్పత్తిలో కంప్యూటర్ స్కిల్ టెస్టుకు ఎంపిక చేస్తారు. ఇందులో జనరల్ 40 శాతం, రిజర్వుడ్ అభ్యర్థులు 30 శాతం కనీసార్హత మార్కులు రావాలి. సీబీటీ మార్కులతోనే తుది ఎంపిక ఉంటుంది. హైదరాబాద్, విజయవాడలో పరీక్ష కేంద్రాలు ఉంటాయి.
రఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: జేటీటీ- సర్వే పోస్టుకు రూ.200, మిగిలిన పోస్టులకు రూ.300 ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికులకు ఫీజు లేదు.
దరఖాస్తుకు చివరి తేదీ: మే 11
వెబ్సైట్: http://www.powergrid.in/
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



