Navy | ఇండియన్ నేవీ కొత్త చీఫ్గా అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్
Navy | భారత నౌకాదళ కొత్త చీఫ్గా అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని సౌత్ బ్లాక్లో ఆయనకు సాంప్రదాయ గార్డ్ ఆఫ్ ఆనర్తో ఘన స్వాగతం పలికారు. ఈ నియామకంతో ఆయన భారత నౌకాదళానికి 27వ నౌకాదళ అధిపతిగా బాధ్యతలు చేపట్టారు.
Navy | భారత నౌకాదళ కొత్త చీఫ్గా అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని సౌత్ బ్లాక్లో ఆయనకు సాంప్రదాయ గార్డ్ ఆఫ్ ఆనర్తో ఘన స్వాగతం పలికారు. ఈ నియామకంతో ఆయన భారత నౌకాదళానికి 27వ నౌకాదళ అధిపతిగా బాధ్యతలు చేపట్టారు. పదవీ విరమణ చేసిన నౌకాదళ చీఫ్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి జాతీయ యుద్ధ స్మారక స్థూపాన్ని సందర్శించి దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమర జవాన్లకు నివాళులర్పించారు. అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ 1987 జూలై 1న భారత నౌకాదళంలో కమిషన్ పొందారు. కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థల్లో నిపుణుడిగా గుర్తింపు పొందిన ఆయన ఖడక్వాస్లాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ)లో విద్యాభ్యాసం పూర్తి చేశారు. అనంతరం యునైటెడ్ కింగ్డమ్లోని జాయింట్ సర్వీసెస్ కమాండ్ అండ్ స్టాఫ్ కాలేజ్, కరంజాలోని కాలేజ్ ఆఫ్ నావల్ వార్ఫేర్, అమెరికాలోని న్యూపోర్ట్ నావల్ వార్ కాలేజ్ల్లో ఉన్నత విద్యను అభ్యసించారు.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం అడ్మిరల్ స్వామినాథన్ మాట్లాడుతూ.. ఈ పదవిని గౌరవంతో పాటు బాధ్యతగా స్వీకరిస్తున్నానన్నారు. దేశ అత్యున్నత నాయకత్వం తనపై ఉంచిన విశ్వాసం జీవితంలో అత్యున్నత గౌరవమని పేర్కొన్నారు. దేశ ప్రయోజనాల పరిరక్షణ కోసం భారత నౌకాదళం ఎల్లప్పుడూ అప్రమత్తంగా, సన్నద్ధంగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ప్రాంతీయ భద్రతా పరిస్థితులు సవాళ్లతో కూడుకుని, సంక్లిష్టంగా ఉన్నాయన్నారు. నౌకాదళ కార్యాచరణ సామర్థ్యం, యుద్ధ సన్నద్ధతను అత్యున్నత స్థాయిలో కొనసాగించడం తన తొలి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. దేశ భద్రతతో పాటు ఆర్థిక ప్రయోజనాల పరిరక్షణకు ఇది అత్యంత కీలకమని పేర్కొన్నారు. భారత నౌకాదళం ఇప్పటికే ఆధునికీకరణ దిశగా బలమైన అడుగులు వేస్తోందని, ప్రస్తుతం కొనసాగుతున్న అన్ని ప్రాజెక్టులను మరింత వేగవంతం చేయడమే తన లక్ష్యమని చెప్పారు. అవసరమైన చోట ప్రణాళికలను విస్తరించి, అత్యాధునిక సాంకేతికతను నౌకాదళంలో త్వరితగతిన ప్రవేశపెడతామని తెలిపారు.
ఈ సందర్భంగా మాజీ నౌకాదళ చీఫ్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు. నౌకాదళానికి కొత్త దిశానిర్దేశం చేసిన నాయకుడిగా ఆయన సేవలను కొనియాడారు. తన పదవీకాలంలోని ప్రతి రోజును భారత నౌకాదళాన్ని మరింత ఆధునికంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు అంకితం చేస్తానని అడ్మిరల్ స్వామినాథన్ తెలిపారు. ఆయన పరమ్ విశిష్ట సేవా పతకం, విశిష్ట సేవా పతకాలతో సత్కారం పొందిన అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ తన సుదీర్ఘ సేవా కాలంలో పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. ఐఎన్ఎస్ విద్యుత్, ఐఎన్ఎస్ వినాష్, ఐఎన్ఎస్ కులిష్, ఐఎన్ఎస్ మైసూర్, విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యలకు కమాండర్గా సేవలందించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●US NRI Returning To India | NRIలు ఇండియాకు ఎందుకు తిరిగి రారు? ఈ నిజాలు తెలిస్తే షాక్!
- ●Bulandshahr Monkey Viral Video | వర్షంలా రాలిన రూ.500 నోట్లు.. లాయర్ బ్యాగ్ లాక్కొని చెట్టెక్కిన కోతి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- ●Sridhar Vembu AI Bubble | 1999 డాట్-కామ్ క్రాష్ రిపీట్ కాబోతోందా? 'AI బబుల్'పై జోహో ఫౌండర్ శ్రీధర్ వేంబు స్ట్రాంగ్ వార్నింగ్
- ●Harish Rao | 'రైతు డిస్కం' వ్యవసాయానికి ఉరితాడు.. సోలార్ పవర్తో 24 గంటల కరెంట్ ఎలా ఇస్తారు? సీఎం రేవంత్పై హరీశ్రావు ఫైర్
- ●Mallu Ravi | కేటీఆర్, హరీష్ రావులకు మతిస్థిమితం లేదు.. కూల్చేస్తాం, పేల్చేస్తాం అంటారా? ఎంపీ మల్లు రవి ఫైర్
- ●Kajal Aggarwal | పొట్టి డ్రెస్లో కాజల్ అందాల విందు

US NRI Returning To India | NRIలు ఇండియాకు ఎందుకు తిరిగి రారు? ఈ నిజాలు తెలిస్తే షాక్!

Bulandshahr Monkey Viral Video | వర్షంలా రాలిన రూ.500 నోట్లు.. లాయర్ బ్యాగ్ లాక్కొని చెట్టెక్కిన కోతి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Sridhar Vembu AI Bubble | 1999 డాట్-కామ్ క్రాష్ రిపీట్ కాబోతోందా? 'AI బబుల్'పై జోహో ఫౌండర్ శ్రీధర్ వేంబు స్ట్రాంగ్ వార్నింగ్

Harish Rao | 'రైతు డిస్కం' వ్యవసాయానికి ఉరితాడు.. సోలార్ పవర్తో 24 గంటల కరెంట్ ఎలా ఇస్తారు? సీఎం రేవంత్పై హరీశ్రావు ఫైర్






