త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mumbai Ahmedabad Bullet Train | దేశంలో పరుగులు తీయనున్న తొలి బుల్లెట్ ట్రైన్: ఫస్ట్ ఫేజ్ ఎప్పటినుంచంటే?

దేశంలోనే తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టుపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గుడ్‌న్యూస్ చెప్పారు. వచ్చే ఏడాది సూరత్-బిలిమోరా మధ్య ఫస్ట్ ఫేజ్ ప్రారంభం కానుంది.

J

National | Published On Jul 12, 2026, 11.00 pm IST

Mumbai Ahmedabad Bullet Train | దేశంలో పరుగులు తీయనున్న తొలి బుల్లెట్ ట్రైన్: ఫస్ట్ ఫేజ్ ఎప్పటినుంచంటే?
Advertisement

Mumbai Ahmedabad Bullet Train | త్రినేత్ర.న్యూస్ : రైల్వే ప్రయాణికులకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. దేశంలోనే ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ (Mumbai-Ahmedabad bullet train) ప్రాజెక్టు తొలి దశ వచ్చే ఏడాది ప్రారంభం కానుందని వెల్లడించారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. సూరత్-బిలిమోరా సెక్షన్ మధ్య తొలి హై-స్పీడ్ రైలు సేవలు అందుబాటులోకి రానున్నట్లు స్పష్టం చేశారు.

దశల వారీగా బుల్లెట్ ట్రైన్ సర్వీసులు

హైదరాబాద్‌లో జరిగిన హైసియా (HYSEA) ఐటీ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న మంత్రి.. బుల్లెట్ ట్రైన్ పనుల ప్రోగ్రెస్ (progress) గురించి వివరించారు. ఈ కారిడార్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు.

Image

"మొదటగా వచ్చే ఏడాది సూరత్, బిలిమోరా మధ్య ఫస్ట్ సెక్షన్ ప్రారంభిస్తాం. ఆ వెంటనే వాపి నుంచి సూరత్, వాపి నుంచి అహ్మదాబాద్, అహ్మదాబాద్ నుంచి థానే, చివరగా అహ్మదాబాద్ నుంచి ముంబైకి.. ఇలా దశలవారీగా (phase-by-phase) ఈ బుల్లెట్ రైలు సేవలను విస్తరిస్తాం" అని వైష్ణవ్ వివరించారు.

శరవేగంగా రైల్వే స్టేషన్ల ఆధునీకరణ

కేవలం కొత్త రైళ్లనే కాకుండా, పాత స్టేషన్ల రూపురేఖలు మార్చే 'నవ-నిర్మాణ్' (Nav-Nirmaan) ప్రోగ్రాం గురించి కూడా మంత్రి అప్‌డేట్ ఇచ్చారు. ఈ ప్రాజెక్టు కింద ఇప్పటికే దేశవ్యాప్తంగా 261 రైల్వే స్టేషన్ల రీ-డెవలప్‌మెంట్ పనులు పూర్తయినట్లు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు వేగంతో ఈ పనులు జరుగుతున్నాయన్నారు.

Image

ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (Secunderabad railway station) ఆధునీకరణ పనులపై ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. "సాధారణంగా ప్రపంచంలో ఎక్కడైనా రైల్వే స్టేషన్ల పనులు జరిగితే ట్రాఫిక్ ఆపేస్తారు. కానీ మన దగ్గర అలా చేయలేం. రైళ్లు నడుస్తుండగానే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా భద్రత, నాణ్యతతో ఎయిర్ కాంకోర్స్ (air concourse) నిర్మిస్తున్నాం" అని పేర్కొన్నారు.

హై-స్పీడ్ హబ్‌గా హైదరాబాద్

హైదరాబాద్‌కు రాబోయే రోజుల్లో మహర్దశ పట్టనుందని రైల్వే మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. భాగ్యనగరాన్ని ఒక హై-స్పీడ్ రైల్ హబ్‌గా మార్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ మూడు కీలక బుల్లెట్ ట్రైన్ కారిడార్లను (corridors) ప్రతిపాదించినట్లు గుర్తుచేశారు.

Image

పుణె-హైదరాబాద్, హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు మధ్య ఈ హై-స్పీడ్ మార్గాలు రానున్నాయని తెలిపారు. "ఈ ప్రాజెక్టులు పూర్తయితే హైదరాబాద్ రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి. ఈ కనెక్టివిటీతో ఈ ప్రాంతమంతా ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందుతుంది" అని మంత్రి వైష్ణవ్ ధీమా వ్యక్తం చేశారు.

Image

Advertisement

తాజావార్తలు

Advertisement