త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Assembly Election Exit Polls 2026 | ఎగ్జిట్ పోల్స్ 2026: అస్సాంలో ‘హిమంత’ మ్యాజిక్.. బెంగాల్‌లో కమలం వికాసం.. కేరళలో యూడీఎఫ్, తమిళనాడులో డీఎంకే!

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. అస్సాం, పుదుచ్చేరిల్లో ఎన్డీఏ (NDA) కూటమి అధికారాన్ని నిలబెట్టుకోనుండగా.. పశ్చిమ బెంగాల్‌లో కమలం వికసించబోతోందని మెజారిటీ సర్వేలు తేల్చాయి. అటు కేరళలో వామపక్షాలకు షాకిస్తూ కాంగ్రెస్ (UDF), తమిళనాడులో డీఎంకే కూటమి జయకేతనం ఎగరవేయనున్నట్లు ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి.

J

National | Published On Apr 29, 2026, 7.53 pm IST

Assembly Election Exit Polls 2026 | ఎగ్జిట్ పోల్స్ 2026: అస్సాంలో ‘హిమంత’ మ్యాజిక్.. బెంగాల్‌లో కమలం వికాసం.. కేరళలో యూడీఎఫ్, తమిళనాడులో డీఎంకే!
Advertisement

Assembly Election Exit Polls 2026 | త్రినేత్ర.న్యూస్ : దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐదు రాష్ట్రాల (పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ (Exit Polls) ఫలితాలు వెలువడ్డాయి. ప్రముఖ సర్వే సంస్థలన్నీ తమ అంచనాలను విడుదల చేశాయి. ఏ రాష్ట్రంలో ఎవరు గెలవబోతున్నారనే దానిపై స్పష్టమైన ట్రెండ్స్‌ను ఈ సర్వేలు చూపించాయి.

అస్సాంలో మళ్లీ 'హిమంత' హవా..

అస్సాంలో (మొత్తం 126 సీట్లు, మ్యాజిక్ ఫిగర్: 63) బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ (NDA) కూటమి వరుసగా మూడోసారి భారీ విజయాన్ని నమోదు చేయనుందని 'యాక్సిస్ మై ఇండియా' (Axis My India) సహా పలు సర్వేలు తేల్చాయి. ఎన్డీఏ ఏకంగా 88 నుంచి 100 స్థానాలు కైవసం చేసుకుని అధికారాన్ని నిలబెట్టుకోనుందని, కాంగ్రెస్ కూటమి (CONG+) కేవలం 24-36 స్థానాలకే పరిమితం కానుందని యాక్సిస్ మై ఇండియా అంచనా వేసింది. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ పనితీరే ఈ భారీ విజయానికి కారణమని, ఎన్డీఏకి ఏకంగా 48% ఓట్ షేర్ దక్కనుందని ఆ సంస్థ తెలిపింది. జేవీసీ, మ్యాట్రిజ్ సర్వేలు కూడా ఎన్డీఏ గెలుపును ఖాయం చేశాయి.

బెంగాల్‌లో 'దీదీ'కి బిగ్ షాక్.. పీఠం వైపు బీజేపీ!

పశ్చిమ బెంగాల్‌ (మొత్తం 294 సీట్లు, మ్యాజిక్ ఫిగర్: 147)లో తృణమూల్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీ కోటకు బీటలు వారుతున్నట్లు మెజారిటీ సర్వేలు వెల్లడించాయి. మొత్తం ఐదు ప్రధాన సర్వేల్లో నాలుగు బీజేపీకి పట్టం కట్టాయి. బెంగాల్ చరిత్రలో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా దూసుకుపోతోందని సర్వేలు తేల్చాయి.

ప్రజా పోల్: బీజేపీ+ (178-208), టీఎంసీ+ (85-110)

పీ-మార్క్: బీజేపీ+ (150-175), టీఎంసీ+ (118-138)

మ్యాట్రిజ్: బీజేపీ+ (146-161), టీఎంసీ+ (125-140)

పోల్ డైరీ: బీజేపీ+ (142-171), టీఎంసీ+ (99-127)

కేవలం 'పీపుల్స్ పల్స్' మాత్రమే టీఎంసీకి (177-187) మొగ్గు చూపుతూ ఫలితాలు విడుదల చేసింది.

కేరళలో వామపక్షాలకు భంగపాటు.. కాంగ్రెస్ దే పీఠం

కేరళలో (మొత్తం 140 సీట్లు, మ్యాజిక్ ఫిగర్: 70) పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ (LDF) రెండు దఫాల ప్రభుత్వానికి చుక్కెదురు కానుంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ (UDF) 78-90 స్థానాలతో ఘన విజయం సాధించి తిరిగి అధికారంలోకి రానుందని యాక్సిస్ మై ఇండియా స్పష్టం చేస్తోంది. ఎల్‌డీఎఫ్ 49-62 స్థానాలకే పరిమితం కానుండగా, బీజేపీ 0-3 స్థానాలు దక్కించుకునే అవకాశం ఉంది. కుల సమీకరణాలు, మహిళా ఓటర్లు యూడీఎఫ్ వైపు నిలబడటమే దీనికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.

తమిళనాడులో మళ్లీ డీఎంకే.. కొత్తగా సత్తా చాటనున్న విజయ్!

తమిళనాడు (మొత్తం 234 సీట్లు, మ్యాజిక్ ఫిగర్: 117) అసెంబ్లీలో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కూటమి (DMK+) మళ్లీ సత్తా చాటనుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. మ్యాట్రిజ్ సర్వే డీఎంకేకు 122-132 సీట్లు, పీ-మార్క్ 125-145 సీట్లు ఇచ్చాయి. అన్నాడీఎంకే (AIADMK+) కాస్త పుంజుకున్నా అధికారానికి దూరంగానే నిలవనుంది (65-110 సీట్లు). ఇక కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి బరిలోకి దిగిన దళపతి విజయ్ (TVK) పార్టీ తొలి ప్రయత్నంలోనే 10 నుంచి 26 వరకు సీట్లు సాధించి సంచలనం సృష్టించే ఛాన్స్ ఉందని సర్వేలు అంచనా వేశాయి.

పుదుచ్చేరిలో ఎన్డీఏ పదిలం

పుదుచ్చేరిలో (మొత్తం 30 సీట్లు, మ్యాజిక్ ఫిగర్: 15) సీఎం ఎన్ఆర్ రంగస్వామి నేతృత్వంలోని ఎన్ఆర్ కాంగ్రెస్-బీజేపీ (NDA) కూటమి మళ్లీ అధికారంలోకి రానుందని సర్వేలు చెబుతున్నాయి. ఎన్డీఏకు 16-20 స్థానాలు, కాంగ్రెస్ కు 6-12 స్థానాలు దక్కే అవకాశం ఉందని యాక్సిస్ మై ఇండియా, పీపుల్స్ పల్స్ సర్వేలు అంచనా వేశాయి.

Advertisement
Advertisement