కేంద్రంపై పోరాడండి.. రైతుల గురించి చర్చించండి.. బీజేపీ ఎమ్మెల్యేలకు డీకే సవాల్
కర్ణాటక అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యేలు చేస్తున్న నిరసనలపై ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఘాటుగా స్పందించారు. బెళగావిలో ఉన్న సువర్ణ సౌధలో శీతాకాల సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో రైతుల సమస్యలపై బీజేపీ ఎమ్మెల్యేల ఆందోళనను ఉద్దేశించి శివకుమార్ మాట్లాడుతూ.. బీజేపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై కాకుండా కేంద్ర ప్రభుత్వంపై పోరాడాలని హితవు పలికారు.
ఉత్తర కర్ణాటకపై చర్చ జరగాలి
ఈసందర్భంగా మీడియాతో మాట్లాడిన డిప్యూటీ సీఎం.. ఉత్తర కర్ణాటక సమస్యల గురించి బీజేపీ ఎమ్మెల్యేలు చర్చించాలని మేము కోరుకుంటున్నాము. రాజకీయ నిరసనలు చేయడం కాదు.. ఆ ప్రాంత అభివృద్ధి గురించి కూడా మాట్లాడాలని వ్యాఖ్యానించారు.
కేంద్రం విఫలం
రైతుల సమ్యలపై కేంద్రం ఎందుకు స్పందించడం లేదు.. రైతులను ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. రైతులకు ఎందుకు సహాయం చేయడం లేదో బీజేపీ నేతలు చర్చించాలి. చెరకు ధరల లేక రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. దీనిపై కేంద్రం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది
రైతుల సంక్షేమం కోసం కర్ణాటక ప్రభుత్వం కట్టుబడి ఉంది. రైతులకు అండగా నిలిచింది.. భవిష్యత్తులోనూ నిలుస్తుంది. వారికి మద్దతు ఇచ్చింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోంది? బీజేపీ నేతలు నిజంగా రైతుల పక్షపాతులైతే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ గళాన్ని విప్పాలని డీకే శివకుమార్ డిమాండ్ చేశారు.
#WATCH | Belagavi | On BJP MLAs to protest against the state government in the Suvarna Soudha today, Karnataka Dy CM DK Shivakumar says, "We want them to discuss about North Karnataka. We want them to discuss why the Central government is not helping the farmers. There is a big… pic.twitter.com/ifYIJ9TWDD
— ANI (@ANI) December 9, 2025
సంబంధిత వార్తలు

Siddaramaiah | డీకే శివకుమార్ సీఎం అయ్యేనా..? ఢిల్లీ నుంచి పిలుపు వస్తే వెళ్తానన్న సిద్ధారామయ్య..!
మే 5, 2026

Mallikarjun Kharge | కర్నాటక సీఎం మార్పుపై మల్లికార్జున్ ఖర్గే ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
మే 1, 2026

Priyank Kharge | కర్నాటకలో నాయకత్వ మార్పులు.. తోసిపుచ్చిన ప్రియాంక్ ఖర్గే..!
ఏప్రిల్ 25, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



