Madame Tussauds London | భారత సెలబ్రిటీల మైనపు విగ్రహాలను చూస్తారా? మే 1 నుంచి మేడమ్ టుస్సాడ్స్లో ప్రదర్శన స్టార్ట్
ఇప్పటికే లండన్లో భారతీయులు ఉంటే, లేదా జూన్ 30 లోపు లండన్ వెళ్లేందుకు ప్లాన్ చేస్తుంటే మేడమ్ టుస్సాడ్స్ను కూడా సందర్శించి పలువురు భారత ప్రముఖుల మైనపు విగ్రహాల ప్రదర్శనను చూడొచ్చు. సాధారణ ఎంట్రీ టికెట్తోనే ఈ ప్రదర్శనకు మ్యూజియం అనుమతినిస్తోంది.
International | Published On May 3, 2026, 6.56 pm IST
Madame Tussauds London | లండన్లో ఉన్న ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం తెలుసు కదా. ఈ మ్యూజియంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వ్యక్తుల మైనపు విగ్రహాలను ఏర్పాటు చేస్తారు. మన దేశం నుంచి ఇప్పటికే ఇక్కడ బాలీవుడ్, టాలీవుడ్, క్రికెట్ ప్రముఖుల మైనపు విగ్రహాలను ఏర్పాటు చేశారు. బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, రణబీర్ కపూర్, ఐశ్వర్యారాయ్, దీపికా పడుకోణ్, ప్రియాంకా చోప్రా, హృతిక్ రోషన్, రణ్వీర్ సింగ్, కత్రినా కైఫ్, మాధురీ దీక్షిత్, టాలీవుడ్ నుంచి కాజల్ అగర్వాల్ మైనపు విగ్రహాలు కూడా ఏర్పాటు చేశారు. క్రికెట్ ప్రముఖులైన సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లీ విగ్రహాలు కూడా ఉన్నాయి. వీటితో పాటు హాలీవుడ్ ప్రముఖులు, వరల్డ్ సెలబ్రిటీల మైనపు విగ్రహాలు కూడా అక్కడ కొలువుదీరాయి. ఈనేపథ్యంలో మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మే 1 నుంచి ఆయా మైనపు విగ్రహాల ప్రదర్శనను ప్రారంభించారు.

జూన్ 30 వరకు ప్రదర్శన
మే 1 నుంచి జూన్ 30 వరకు రెండు నెలల పాటు ఈ ప్రదర్శన అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే ఉన్న విగ్రహాలతో పాటు మరికొన్ని విగ్రహాలను సింగపూర్లోని మేడమ్ టుస్సాడ్స్ నుంచి తీసుకొచ్చి ప్రదర్శనలో ఉంచుతున్నారు. సింగపూర్ నుంచి కాజల్ అగర్వాల్ విగ్రహాన్ని ఇక్కడికి తీసుకొచ్చి ప్రదర్శనలో ఉంచారు. కేవలం భారతీయుల కోసమే ప్రత్యేకంగా ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ ప్రదర్శనను తీర్చిదిద్దారు.

ఇప్పటికే లండన్లో భారతీయులు ఉంటే, లేదా జూన్ 30 లోపు లండన్ వెళ్లేందుకు ప్లాన్ చేస్తుంటే మేడమ్ టుస్సాడ్స్ను కూడా సందర్శించి పలువురు భారత ప్రముఖుల మైనపు విగ్రహాల ప్రదర్శనను చూడొచ్చు. సాధారణ ఎంట్రీ టికెట్తోనే ఈ ప్రదర్శనకు మ్యూజియం అనుమతినిస్తోంది.

తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



