త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sridhar Babu | ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ.. మార్పున‌కు చిరునామాగా హైద‌రాబాద్ అభివృద్ధి: మంత్రి శ్రీధ‌ర్ బాబు

Sridhar Babu | హైదరాబాద్‌ను సిగ్నల్‌ రహిత నగరంగా మార్చాలన్న సంకల్పంతో ఎస్‌ఆర్‌డీపీ పథకంలో భాగంగా రాజేంద్రన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలోని శాస్త్రీపురంలో నిర్మించిన ఆర్వోబీని మంత్రి శ్రీధ‌ర్ బాబు (Sridhar Babu) ప్రారంభించారు.

G

Hyderabad | Published On Apr 17, 2026, 10.45 am IST

Sridhar Babu | ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ.. మార్పున‌కు చిరునామాగా హైద‌రాబాద్ అభివృద్ధి: మంత్రి శ్రీధ‌ర్ బాబు
Advertisement

Sridhar Babu | త్రినేత్ర‌.న్యూస్‌: హైదరాబాద్‌ను సిగ్నల్‌ రహిత నగరంగా మార్చాలన్న సంకల్పంతో ఎస్‌ఆర్‌డీపీ పథకంలో భాగంగా రాజేంద్రన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలోని శాస్త్రీపురంలో (Shastripuram ROB) నిర్మించిన ఆర్వోబీని మంత్రి శ్రీధ‌ర్ బాబు (Sridhar Babu) ప్రారంభించారు. సికింద్రాబాద్‌-ఫలక్‌నుమా-శివరాంపల్లి రైల్వే లైన్‌ మధ్య శాస్త్రిపురం వద్ద లెవల్‌ క్రాసింగ్‌ కారణంగా ఎదురవుతున్న ట్రాఫిక్‌ చికులకు శాశ్వత పరిషారం చూపేలా రూ.71 కోట్ల‌తో జీహెచ్ఎంసీ నిర్మించిన ఈ ఆర్వోబీని మండ‌లిలో ప్ర‌భుత్వ చీఫ్‌విప్ ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ప్ర‌కాశ్ గౌడ్‌తో క‌లిసి మంత్రి శ్రీధ‌ర్ బాబు ప్ర‌జ‌ల‌కు అంకితం చేశారు. అదేవిధంగా ఫలక్‌నుమా బస్ డిపో నుంచి మైలార్‌దేవ్‌ప‌ల్లి వరకు 490 మీటర్ల మేర నిర్మించిన 4 లైన్ల రోడ్డును కూడా ప్రారంభించారు. అనంత‌రం మంత్రి శ్రీధ‌ర్ బాబు మాట్లాడుతూ..

ఓల్డ్ సిటీ అనకుండా ఒరిజినల్ సిటీగా జీహెచ్ఎంసీ పరిధిలో హైదరాబాద్‌ను దేశంలోనే గొప్ప అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలతో మహానగరంగా తీర్చిదిద్దుతామ‌న్నారు. మార్పున‌కు చిరునామాగా కోట్లాది రూపాయ‌ల‌ నిధులతో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో హైదరాబాద్ అభివృద్ధి వేగంగా సాగుతుందని చెప్పారు. ముఖ్యంగా పర్యాటక ప్రాంతంగా హైదరాబాద్ మహానగరాన్ని తీర్చిదిద్దుతున్నామ‌ని వెల్ల‌డించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్దుతూ పోకుండా ప్రణాళిక బద్దంగా హైదరాబాద్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామ‌ని తెలిపారు.

ఆర్వోబీతో 30 నిమిషాలు ఆదా..
ఈ ఆర్వోబీ అందుబాటులోకి రావడంతో మైలార్‌ దేవ్‌ పల్లి నుంచి వట్టేపల్లి మీదుగా ఫలక్‌ నుమా డిపోకు వెళ్లే ప్రయాణికులకు ట్రాఫిక్‌ కష్టాలు తప్ప‌నున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు రైల్వే గేటు పడిన ప్రతిసారీ కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయేది. ఈ బ్రిడ్జి ద్వారా ప్రయాణ సమయం సుమారు 30 నిమిషాల మేర ఆదా కానుంది. దీంతో నిత్యం రైల్వే గేటు పడటంతో అసహననాకి గురయ్యే వాహనదారుల ఇబ్బందులు తీరనున్నాయి.

Advertisement
Advertisement