త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chamala Kirankumar Reddy | బీఎల్ఏలు బాధ్య‌తాయుతంగా ప‌ని చేయాలి: ఎంపీ చామ‌ల‌

Chamala Kirankumar Reddy | ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా, ఓటర్ల జాబితాలో తప్పులను సరిదిద్దేలా బూత్ లెవెల్ ఏజెంట్లు (BLA) బాధ్యతాయుతంగా పనిచేయాలని భువ‌న‌గిరి ఎంపీ చామ‌ల కిర‌ణ్‌కుమార్‌రెడ్డి సూచించారు. ఇబ్రహీంపట్నంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ’ అవగాహన-శిక్షణ శిబిరంలో ఆయ‌న‌ పాల్గొని మాట్లాడారు.

S

Hyderabad | Published On Jun 14, 2026, 3.08 pm IST

Chamala Kirankumar Reddy | బీఎల్ఏలు బాధ్య‌తాయుతంగా ప‌ని చేయాలి: ఎంపీ చామ‌ల‌
Advertisement

Chamala Kirankumar Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా, ఓటర్ల జాబితాలో తప్పులను సరిదిద్దేలా బూత్ లెవెల్ ఏజెంట్లు (BLA) బాధ్యతాయుతంగా పనిచేయాలని భువ‌న‌గిరి ఎంపీ చామ‌ల కిర‌ణ్‌కుమార్‌రెడ్డి సూచించారు. క్షేత్రస్థాయిలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఇబ్రహీంపట్నంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) ఆధ్వర్యంలో ఆదివారం నిర్వ‌హించిన‌ ‘ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ’ అవగాహన-శిక్షణ శిబిరంలో ఆయ‌న‌ పాల్గొని మాట్లాడారు.

ఈ శిక్షణా తరగతులలో బీఎల్ఏ ట్రైనర్ చైతన్య కృష్ణారెడ్డి పాల్గొని ఏజెంట్లకు కావలసిన సాంకేతిక, క్షేత్రస్థాయి విధి విధానాలపై సమగ్ర శిక్షణ, అవగాహన కల్పించారు. స్థానిక ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వ‌హించారు. ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ పరిగి ఎమ్మెల్యే టీ. రామ్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు.

ఈ శిక్షణా శిబిరంలో నియోజకవర్గ పరిధిలోని మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులు, బూత్ లెవెల్ ఏజెంట్లు పాల్గొన్నారు.

Advertisement
Advertisement