త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SIR | ‘స‌ర్‌’లో అనేక లోటుపాట్లు.. ఎస్ఈసీకి బీఆర్ఎస్ విన‌తి

SIR | 'స‌ర్‌'లో అనేక లోటుపాట్లు ఉన్నాయ‌ని, వాట‌న్నింటిని స‌వ‌రించాల‌ని కోరుతూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డికి బీఆర్ఎస్ స‌ర్ కో ఆర్డినేషన్ కమిటీ సభ్యులు ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ ఎమ్మెల్సీ క‌ర్నె ప్ర‌భాక‌ర్, బీఆర్ఎస్ లీడ‌ర్స్ సుమిత్రానంద్, వై స‌తీశ్ రెడ్డి, రంగినేని అభిలాష్ రావు విన‌తిప‌త్రం స‌మ‌ర్పించారు.

S

Telangana | Published On Jul 14, 2026, 7.10 pm IST

SIR | ‘స‌ర్‌’లో అనేక లోటుపాట్లు.. ఎస్ఈసీకి బీఆర్ఎస్ విన‌తి
Advertisement

SIR | త్రినేత్ర‌.న్యూస్ : 'స‌ర్‌'లో అనేక లోటుపాట్లు ఉన్నాయ‌ని, వాట‌న్నింటిని స‌వ‌రించాల‌ని కోరుతూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డికి బీఆర్ఎస్ స‌ర్ కో ఆర్డినేషన్ కమిటీ సభ్యులు ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ ఎమ్మెల్సీ క‌ర్నె ప్ర‌భాక‌ర్, బీఆర్ఎస్ లీడ‌ర్స్ సుమిత్రానంద్, వై స‌తీశ్ రెడ్డి, రంగినేని అభిలాష్ రావు విన‌తిప‌త్రం స‌మ‌ర్పించారు.

ఈ సంద‌ర్భంగా క‌ర్నె ప్ర‌భాక‌ర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో స‌ర్ కార్యక్రమం జరుగుతుంది. కానీ బీఎల్‌వోలు క్షేత్ర స్థాయిలో పని చేయటం లేదు. టెక్నికల్‌గా కొన్ని అనుమానాలు ఉన్నాయి. అయినా ఎలక్షన్ కమిషన్ నుంచి సమాధానం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న స‌ర్‌ కార్యక్రమంలో అనేక రకాలుగా లోటుపాట్లు ఉన్నాయి. ఓటర్ల విషయంలో అనేక చిక్కులు ఉన్నాయి. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అనేక పిటిషన్లు ఉన్నాయి. వీటన్నింటినీ సుదర్శన్ రెడ్డికి తెలిపాం. వీటిని వెంటనే పరిష్కరించాలని కోరిన‌ట్లు తెలిపారు.

ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన సమయం సరిపోదు. సమయం పొడిగించాలని చెప్పాం. కానీ స్పందన లేదు. సుదర్శన్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. మా పార్టీ తరుఫున కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను కలిశాం. కానీ ఎలాంటి స్పందన లేదు. కచ్చితంగా గడువు పొడిగించి, ఇచ్చిన పిటిషన్లు పరిష్కరించాలి అని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement