Techie Drowns In Noida Ditch | నోయిడాలో ఘోరం: 70 అడుగుల లోతు గుంతలో పడ్డ కారు.. తండ్రికి ఫోన్ చేసి ప్రాధేయపడినా దక్కని ప్రాణం
ఆ ప్రాంతంలో ఓ మాల్ నిర్మాణం జరుగుతోందట. అందుకోసమే భారీగా గుంత తవ్వి.. కింది నుంచి బేస్మెంట్ నిర్మాణం చేపడుతున్నారు. దాని నిర్మాణం ఇంకా పూర్తికాకపోవడం వల్ల, అక్కడ మురుగు నీరు చేరింది.
Techie Drowns In Noida Ditch | గ్రేటర్ నోయిడాలో విషాదం చోటు చేసుకుంది. రోడ్డు పక్కనే ఉన్న మురుగు కాలువలో కారు పడటంతో అందులో ఉన్న మురుగు నీటిలో కారు మునిగి అందులో ఉన్న 27 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజినీర్ యువ్రాజ్ మెహతా మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి సెక్టార్ 150కి సమీపంలో చోటు చేసుకుంది. యువ్రాజ్ ఆఫీసు నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పక్కనే మురుగు నీటి నిర్వహణ కోసం అధికారులు పెద్ద గుంత తీశారు. అందులో మురుగు నీరు ఉంది. ఓవైపు పొగమంచుతో రోడ్డు సరిగ్గా కనిపించకపోవడంతో రోడ్డు పక్కనే ఉన్న డ్రైనేజీ బేసిన్ రిడ్జ్ని తాగిన కారు అదుపుతప్పి నేరుగా మురుగు కాలువలోకి దూసుకెళ్లింది. ఆ మురుగుకాలువలో 70 ఫీట్ల మేర మురుగు నీరు ఉండటంతో క్షణాల్లో కారు అందులో మునిగిపోయింది. వెంటనే తేరుకున్న యువ్రాజ్ తన తండ్రికి ఫోన్ చేసి ప్రమాదం గురించి చెప్పాడు. తనకు చావాలని లేదని.. ఎలాగైనా తనను కాపాడాలని వేడుకున్నాడు. కారు నుంచి బయటికి వెళ్లే చాన్స్ లేకపోవడంతో అందులోనే మునిగి చనిపోయాడు. వెంటనే అక్కడికి చేరుకున్న రెస్క్యూ టీమ్.. 5 గంటల పాటు కష్టపడి కారును వెలికితీయగా.. కారులోనే విగతజీవిగా యువ్రాజ్ కనిపించడంతో యువ్రాజ్ కుటుంబ సభ్యులు బోరున విలపించారు.
యువ్రాజ్ని కాపాడేందుకు యత్నించిన డెలివరీ బాయ్
కారు గుంతలో పడటాన్ని గమనించిన మోనిందర్ అనే డెలివరీ ఏజెంట్ వెంటనే ఆ గుంత దగ్గరికి వెళ్లి యువ్రాజ్ని కాపాడే ప్రయత్నం చేశాడు. యువ్రాజ్కి ఊపిరి ఆడటం లేదని గుర్తించి తన నడుముకు తాడు కట్టుకొని డ్రైనేజీలోకి దూకాడు. కానీ.. అప్పటికే యువ్రాజ్ మృతి చెందడంతో మునిందర్ తిరిగి పైకి వచ్చేశాడు.

అధికారులే బాధ్యులు
10 రోజుల కిందనే ఇదే మురుగు కాలువలో ఓ ట్రక్ పడిందని.. రోడ్డు పక్కనే ఇంత పెద్ద మురుగు కాలువను తవ్వడం, ఎలాంటి ఇండికేషన్స్ లేకుండా ఉండటం వల్ల వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని, అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని మోనిందర్ మండిపడ్డాడు.
అయితే.. ఆ ప్రాంతంలో ఓ మాల్ నిర్మాణం జరుగుతోందట. అందుకోసమే భారీగా గుంత తవ్వి.. కింది నుంచి బేస్మెంట్ నిర్మాణం చేపడుతున్నారు. దాని నిర్మాణం ఇంకా పూర్తికాకపోవడం వల్ల, అక్కడ మురుగు నీరు చేరింది. డ్రైనేజీ నీరు రోజు అందులో కలుస్తుండటం వల్ల అది డేంజర్గా మారి ఇలా ప్రాణాలు తీస్తోంది. ఈ ఘటనపై స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సంబంధిత వార్తలు

Dowry | రూ.50లక్షల బంగారం, ఎస్యూవీ కారు ఇచ్చినా అదనపు కట్నం కోసం వేధింపులు.. వివాహిత బలవన్మరణం
మే 18, 2026

Noida Techie Drown Case | నోయిడా టెకీ మృతి కేసు.. నిర్మాణ సంస్థ ఓనర్ అరెస్ట్
జనవరి 20, 2026

Techie Drowning Case | టెకీ మృతి కేసు.. యోగి సర్కార్ సీరియస్: నోయిడా అథారిటీ సీఈవోపై వేటు, సిట్ ఏర్పాటు
జనవరి 19, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



