త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

UPI transactions | రూ.230 ల‌క్ష‌ల కోట్లు.. రికార్డు స్థాయిలో యూపీఐ లావాదేవీలు : కేంద్రం

UPI transactions | 2025-26 ఆర్థిక సంవ‌త్స‌రం డిసెంబ‌ర్ వ‌ర‌కూ యూపీఐ ద్వారా జ‌రిగిన లావాదేవీలు రికార్డు స్థాయిలో రూ.230 ల‌క్ష‌ల కోట్ల‌కు చేరిన‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

D

Business | Published On Feb 4, 2026, 12.30 pm IST

UPI transactions | రూ.230 ల‌క్ష‌ల కోట్లు.. రికార్డు స్థాయిలో యూపీఐ లావాదేవీలు : కేంద్రం
Advertisement

UPI transactions | దేశంలో డిజిటిల్ చెల్లింపులు (UPI transactions) చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఫ‌లితంగా డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ ((UPI) లావాదేవీలు స‌రికొత్త రికార్డుల‌ను సృష్టిస్తున్నాయి. 2025-26 ఆర్థిక సంవ‌త్స‌రం డిసెంబ‌ర్ వ‌ర‌కూ యూపీఐ ద్వారా జ‌రిగిన లావాదేవీలు రికార్డు స్థాయిలో రూ.230 ల‌క్ష‌ల కోట్ల‌కు చేరిన‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు ఆర్థిక శాఖ స‌హాయ మంత్రి పంక‌జ్ చౌద‌రి (Pankaj Chaudhary) రాజ్య‌స‌భ (Rajya Sabha)కు తెలియ‌జేశారు.

ఎగువ స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో విప‌క్షాలు అడిగిన ప్ర‌శ్న‌కు ఆయ‌న స‌మాధాన‌మిచ్చారు. దేశంలో యూపీఐ లావాదేవీల విలువ వేగంగా పెరుగుతోంద‌న్నారు. 2025-26లో ఇప్ప‌టి వ‌ర‌కూ రూ.230 ల‌క్ష‌ల కోట్ల లావాదేవీలు జ‌రిగిన‌ట్లు తెలిపారు. 2022-23లో జ‌రిగిన మొత్తం రూ.139 ల‌క్ష‌ల కోట్ల లావాదేవీల‌తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ అని పేర్కొన్నారు.

ఎనిమిది దేశాల్లో..

భార‌త్ వెలుప‌లా యూపీఐ వినియోగం పెరుగుతోంద‌ని ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ (Nirmala Sitharaman) తెలిపారు. ప్ర‌స్తుతం ఎనిమిది దేశాల్లో ఇది ప‌నిచేస్తున్న‌ట్లు చెప్పారు. భూటాన్‌, ఫ్రాన్స్, మారిష‌స్‌, నేపాల్‌, ఖ‌తార్‌, సింగ‌పూర్‌, శ్రీ‌లంక‌, యూఏఈల్లో యూపీఐ సేవ‌లు అందుబాటులో ఉన్న‌ట్లు తెలిపారు. యూపీఐని అంత‌ర్జాతీయంగా విస్త‌రించేందుకు ప్ర‌భుత్వం, రిజ‌ర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు వెల్ల‌డించారు.

Advertisement
Advertisement