త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TPCC | టీపీసీసీ ఓబీసీ డిపార్ట్‌మెంట్ రాష్ట్ర స్థాయి అత్యవసర సమావేశం

TPCC | తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) ఓబీసీ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి అత్యవసర సమావేశం బుధవారం మధ్యాహ్నం గాంధీ భవన్‌లోని ఓబీసీ డిపార్ట్‌మెంట్ కార్యాలయంలో ఈ స‌మావేశానికి టీపీసీసీ ఓబీసీ డిపార్ట్‌మెంట్ చైర్మన్, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముఖ్య అతిథిగా హాజరై రాష్ట్రవ్యాప్తంగా ఓబీసీ విభాగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక సూచనలు చేశారు.

P

News | Published On Jun 3, 2026, 4.36 pm IST

TPCC | టీపీసీసీ ఓబీసీ డిపార్ట్‌మెంట్ రాష్ట్ర స్థాయి అత్యవసర సమావేశం
Advertisement

TPCC | తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) ఓబీసీ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి అత్యవసర సమావేశం బుధవారం మధ్యాహ్నం గాంధీ భవన్‌లోని ఓబీసీ డిపార్ట్‌మెంట్ కార్యాలయంలో ఈ స‌మావేశానికి టీపీసీసీ ఓబీసీ డిపార్ట్‌మెంట్ చైర్మన్, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముఖ్య అతిథిగా హాజరై రాష్ట్రవ్యాప్తంగా ఓబీసీ విభాగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక సూచనలు చేశారు. పార్టీ నిర్మాణాన్ని గ్రామ స్థాయి వరకు విస్తరించాల్సిన అవసరాన్ని ఆయన ఈ సందర్భంగా వివరించారు. అలాగే, కన్వీనర్లు డాక్టర్ కేతూరి వెంకటేశ్‌, డాక్టర్ జూలూరు ధనలక్ష్మి సమావేశానికి అధ్యక్షత వ‌హించారు. జిల్లాల వారీగా ఆబ్జర్వర్ల నియామకం, పార్టీ బలోపేతం, సామాజిక న్యాయం సాధనలో ఓబీసీల పాత్ర వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.

సమావేశానికి రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు, వివిధ జిల్లాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. జిల్లాల వారీగా పార్టీ నిర్మాణాన్ని వేగవంతం చేయడం, గ్రామ స్థాయి వరకు ఓబీసీ కాంగ్రెస్ శక్తిని విస్తరించడం, అలాగే రాహుల్ గాంధీ గారి సామాజిక న్యాయ లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఓబీసీ వర్గాలను మరింత సంఘటితం చేసి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించనున్నట్లు నాయకులు తెలిపారు. సమావేశం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో, రాజకీయ ప్రాధాన్యతతో సాగిందని పార్టీ వ‌ర్గాలు పేర్కొన్నాయి.

Advertisement
Advertisement