త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Janhvi Kapoor | అభిమాని చేసిన ప‌నికి షాకైన జాన్వీక‌పూర్‌..! అస‌లేమైందంటే..?

Janhvi Kapoor | ఓ అభిమాని చేసిన పనికి బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ గుండె ఆగినంత పనైంది. ఒక్కసారిగా ఏం జరుగుతుందో తెలియక షాక్‌కు గురైంది. మెగాస్టార్‌ రామ్‌చరణ్‌ నటించిన ‘పెద్ది’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో ఈ ఊహించని ఘటన జరిగింది. విజయవాడ వేదికగా జరిగిన కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది.

P

Entertainment | Published On Jun 3, 2026, 3.55 pm IST

Janhvi Kapoor | అభిమాని చేసిన ప‌నికి షాకైన జాన్వీక‌పూర్‌..! అస‌లేమైందంటే..?
Advertisement

Janhvi Kapoor | ఓ అభిమాని చేసిన పనికి బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ గుండె ఆగినంత పనైంది. ఒక్కసారిగా ఏం జరుగుతుందో తెలియక షాక్‌కు గురైంది. మెగాస్టార్‌ రామ్‌చరణ్‌ నటించిన ‘పెద్ది’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో ఈ ఊహించని ఘటన జరిగింది. విజయవాడ వేదికగా జరిగిన కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. వివరాల్లోకి వెళితే.. విజయవాడలో నిర్వహించిన భారీ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో రామ్ చరణ్, జాన్వీ కపూర్ వేదికపై పక్కపక్కనే కూర్చుని అభిమానులను పలకరిస్తున్నారు. అదే సమయంలో ఓ అభిమాని ఒక్కసారిగా వేదికపైకి దూసుకొచ్చాడు. సెక్యూరిటీని దాటుకుని వేగంగా వచ్చాడు. బ్యాలెన్స్ కోల్పోయి నేరుగా జాన్వీ కపూర్ కూర్చున్న సోఫా హ్యాండిల్‌పై పడిపోయాడు.

ఈ హఠాత్‌ పరిణామంతో జాన్వీ కపూర్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. క్షణాల్లోనే వేదికపై గందరగోళ వాతావరణం నెలకొంది. వెంటనే అప్రమత్తమైన రామ్ చరణ్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది స్పందించి ఆ అభిమానిని అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లారు. పరిస్థితి మరింత తీవ్రమవకుండా వెంటనే నియంత్రణలోకి తెచ్చారు. ఈ ఘటనపై అక్కడున్న అభిమానులు, నెటిజన్లు స్పందిస్తూ భద్రతా సిబ్బంది చర్యలను ప్రశంసిస్తున్నారు. పలువురు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సెక్యూరిటీ అంటూ సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే, ఈవెంట్ ముగిసిన తర్వాత రామ్ చరణ్ అదే అభిమానిని ప్రత్యేకంగా పిలిపించి మాట్లాడినట్లు సమాచారం. ఆ సమయంలో భావోద్వేగానికి లోనైన ఆ అభిమాని, చరణ్‌కు కృతజ్ఞతలు తెలిపి ఆయన పాదాలకు నమస్కరించడం గమనార్హం.

ఇదిలా ఉండగా.. దర్శకుడు బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కిన పెద్ది మూవీపై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రంలో కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్‌తో పాటు జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్‌ ఇరానీ తదితర నటులు కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్‌ రెహమాన్‌ మ్యూజిక్‌ అందించారు. వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో మంచి బజ్ ఏర్పడింది. ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ ఓపెనింగ్స్‌పై అంచనాలు నెలకొన్న వేళ, ఈవెంట్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన కూడా సినిమాపై మరింత దృష్టిని ఆకర్షించింది.

Advertisement
Advertisement