త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Lord Uday Nagaraju | టెక్నాలజీలో గ్లోబల్ లీడర్లుగా భారత్, యూకే: ‘ఏఐ’ భాగస్వామ్యంపై కీలక అడుగులు!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), అత్యాధునిక టెక్నాలజీ రంగాల్లో భారత్-యూకే భాగస్వామ్యంపై లండన్‌లో కీలక భేటీ జరిగింది.

J

Telangana | Published On Jul 14, 2026, 8.49 pm IST

Lord Uday Nagaraju | టెక్నాలజీలో గ్లోబల్ లీడర్లుగా భారత్, యూకే: ‘ఏఐ’ భాగస్వామ్యంపై కీలక అడుగులు!
Advertisement
  • యూకే ప్రధాని చీఫ్ ఆఫ్ స్టాఫ్, భారత హైకమిషనర్‌తో లార్డ్ ఉదయ్ నాగరాజు సమావేశం
  • CETA ఒప్పందం నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), టెక్నాలజీ అభివృద్ధిపై కీలక చర్చలు
  • భద్రత, బాధ్యతాయుతమైన ఏఐ వినియోగంలో ఇరు దేశాలను గ్లోబల్ లీడర్లుగా (Global Leaders) నిలపడమే లక్ష్యం
  • 'ఏఐ పాలసీ ల్యాబ్స్' ద్వారా ఎథికల్ ఏఐ ప్రమాణాల రూపకల్పనకు ప్రత్యేక చొరవ

Lord Uday Nagaraju | త్రినేత్ర.న్యూస్ : ప్రపంచాన్ని శాసిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), అత్యాధునిక టెక్నాలజీ (Technology) రంగాల్లో భారత్, యూకే దేశాల మధ్య బంధం మరింత బలోపేతం కానుంది. ఈ మేరకు యూకే ప్రధాని చీఫ్ ఆఫ్ స్టాఫ్ (Chief of Staff), భారత హైకమిషనర్‌తో కలిసి కీలక సమావేశం నిర్వహించినట్లు యూకే పార్లమెంట్ హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడు, 'ఏఐ పాలసీ ల్యాబ్స్' (AI Policy Labs) వ్యవస్థాపకుడు లార్డ్ ఉదయ్ నాగరాజు తెలిపారు.

సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (CETA) నేపథ్యంలో ఇరు దేశాల మధ్య టెక్నాలజీ పరంగా జరుగుతున్న ఈ చర్చలు ఇప్పుడు గ్లోబల్ స్థాయిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

సేఫ్టీ అండ్ ఎథిక్స్.. గ్లోబల్ లీడర్ల దిశగా..

భవిష్యత్తు అంతా ఏఐ (AI) దే అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే దానిని ఎంత భద్రంగా (Safe), బాధ్యతాయుతంగా వాడుతున్నామన్నదే ముఖ్యం. యూకేలోని 'ఏఐ సేఫ్టీ ఇన్‌స్టిట్యూట్' (AI Safety Institute), సీఈటీఏ (CETA) ఒప్పందాల సాయంతో.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారత్, యూకేలు గ్లోబల్ లీడర్లుగా అవతరించేందుకు ఈ చర్చలు ఒక బలమైన పునాదిని వేయనున్నాయి. ఇరు దేశాలు టెక్నాలజీని పంచుకుంటూ, నైతిక విలువలతో కూడిన (Ethical) ఏఐ ప్రమాణాలను రూపొందించుకోవడానికి ఈ సమావేశం ఒక వేదికగా నిలిచింది.

ట్రేడ్ అండ్ ఇన్నోవేషన్‌లో కీలక ముందడుగు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎమర్జింగ్ టెక్నాలజీలపై (Emerging Tech) ఇరు దేశాలు వ్యూహాత్మకంగా దృష్టి సారించాయి. CETA కింద కొత్తగా ఏర్పాటు చేసిన మెకానిజమ్స్ ద్వారా, ట్రేడ్ (Trade), ఇన్నోవేషన్ (Innovation), టాలెంట్ ఎక్స్ఛేంజ్ రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత లోతుగా అన్వేషిస్తున్నారు.

"భారత హైకమిషనర్, యూకే ప్రధాని చీఫ్ ఆఫ్ స్టాఫ్ తో భేటీ అద్భుతంగా జరిగింది. CETA నేపథ్యంలో ముఖ్యంగా ఏఐ (AI), టెక్నాలజీ రంగాల్లో రెండు దేశాల భాగస్వామ్యంపై చర్చించాము" అని లార్డ్ ఉదయ్ నాగరాజు పేర్కొన్నారు.

గ్లోబల్ ఏఐ గవర్నెన్స్ (AI Governance) వేగంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో, ఏఐ పాలసీ ల్యాబ్స్, పార్లమెంటరీ భాగస్వామ్యం ద్వారా లార్డ్ ఉదయ్ నాగరాజు తీసుకుంటున్న ఈ చొరవ.. భారత్,  యూకేల డిజిటల్ భవిష్యత్తుకు ఎంతో మేలు చేస్తుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.

Advertisement
Advertisement