త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vizag Marine Engineer Killed | ఒమ‌న్ తీరంలో నౌకపై అమెరికా మిస్సైల్ దాడి.. విశాఖ మెరైన్ ఇంజినీర్ మృతి.. పెళ్లిరోజుకు ముందే విషాదం

ఒమన్‌ తీరంలో అమెరికా దళాలు చేసిన దాడిలో గల్లంతైన ముగ్గురు భారతీయుల్లో విశాఖ వాసి సురేష్ పట్నాల మృతి చెందారు. పెళ్లిరోజుకు ముందే ఈ విషాదం నెలకొంది.

J

Andhra pradesh | Published On Jun 11, 2026, 7.48 pm IST

Vizag Marine Engineer Killed | ఒమ‌న్ తీరంలో నౌకపై అమెరికా మిస్సైల్ దాడి.. విశాఖ మెరైన్ ఇంజినీర్ మృతి.. పెళ్లిరోజుకు ముందే విషాదం
Advertisement
  • ఒమన్ తీరంలో 'ఎంటీ సెట్టెబెల్లో' నౌకపై అమెరికా దళాల దాడిలో ముగ్గురు భారతీయులు మృతి
  • మృతుల్లో విశాఖపట్నానికి చెందిన మెరైన్ ఇంజినీర్ సురేష్ పట్నాల (44) ఉన్నట్లు ధ్రువీకరించిన ఆంధ్రా భవన్ అధికారులు
  • త్వరలో ఇంటికి రావాల్సిన సురేష్.. వివాహ వార్షికోత్సవానికి ముందే ప్రాణాలు కోల్పోవడంతో కన్నీరుమున్నీరవుతున్న కుటుంబసభ్యులు
  • పౌర నౌకలపై దాడిని తీవ్రంగా పరిగణించిన భారత ప్రభుత్వం.. దౌత్యపరంగా అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్

Vizag Marine Engineer Killed | త్రినేత్ర.న్యూస్ : ఒమన్ తీరంలో వాణిజ్య నౌకపై (Commercial Ship) అమెరికా దళాలు జరిపిన మిస్సైల్ దాడిలో విశాఖపట్నానికి చెందిన 44 ఏళ్ల మెరైన్ ఇంజినీర్ సురేష్ పట్నాల ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో మొత్తం ముగ్గురు భారతీయులు చనిపోగా, వారిలో సురేష్ ఒకరని ఢిల్లీలోని ఆంధ్రా భవన్ (Andhra Bhavan) అధికారులు అధికారికంగా ధ్రువీకరించారు.

నౌకపై అమెరికా దాడి ఎందుకు?

పలావు (Palau) దేశపు జెండాతో ప్రయాణిస్తున్న 'ఎంటీ సెట్టెబెల్లో' (MT Settebello) అనే చమురు ట్యాంకర్‌పై అమెరికా మిలిటరీ దళాలు ఈ క్షిపణి దాడికి పాల్పడ్డాయి. ఇరాన్‌పై ఉన్న ఆంక్షలను (Sanctions) ఉల్లంఘించి ఆయిల్ రవాణా చేస్తున్నారనే ఆరోపణలతోనే ఈ స్ట్రైక్ జరిగింది. తమ హెచ్చరికలను నౌక సిబ్బంది పట్టించుకోలేదని యూఎస్ సెంట్రల్ కమాండ్ (US Central Command) చెబుతోంది.

ఇంజిన్ రూమ్‌లో మంటలు.. ముగ్గురు మృతి

ఈ నౌకలో మొత్తం 24 మంది ఇండియన్ క్రూ (Indian crew) సభ్యులు ఉన్నారు. దాడిలో నౌకలోని ఇంజిన్ రూమ్ పూర్తిగా ధ్వంసమై మంటలు చెలరేగాయి. ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురు నావికులు చనిపోగా, మిగిలిన 21 మందిని ఓమన్ రెస్క్యూ టీమ్స్ సురక్షితంగా కాపాడాయి.

విశాఖ వాసి ఇంట తీవ్ర విషాదం

మృతి చెందిన సురేష్‌కు భార్య భార్గవి, ఇద్దరు కుమారులు (13, 10 ఏళ్లు) ఉన్నారు. గత ఐదు నెలలుగా నౌకలో విధులు నిర్వర్తిస్తున్న ఆయన, త్వరలోనే విశాఖలోని తన ఇంటికి వచ్చేందుకు పర్మిషన్ కూడా తీసుకున్నారు. జూన్ 24న సురేష్ దంపతుల 15వ వివాహ వార్షికోత్సవం (Wedding Anniversary) జరగాల్సి ఉంది. వేడుక చేసుకోవాల్సిన సమయంలో ఇలాంటి దారుణం జరగడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.

సీరియస్ అయిన భారత ప్రభుత్వం

ఇంటర్నేషనల్ వాటర్స్ లో పౌర నౌకలపై జరిగిన ఈ మిలిటరీ స్ట్రైక్‌ను (Military strike) భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. వాణిజ్య నౌకలను టార్గెట్ చేయడం ఆందోళనకరమని, వెంటనే ఉద్రిక్తతలను తగ్గించాలని డిమాండ్ చేసింది. ఈ ఘటనపై ఢిల్లీలోని అమెరికా దౌత్యవేత్తలకు సమన్లు జారీ చేసి భారత్ తన నిరసనను వ్యక్తం చేసింది.

Advertisement

తాజావార్తలు

Advertisement