త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nara Lokesh | విశాఖ స్టీల్ ప్ర‌మాదం.. మంత్రి లోకేష్ తీరుపై కార్మిక సంఘాల గుర్రు

Nara Lokesh | నిన్న జ‌రిగిన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్ర‌మాదంలో చ‌నిపోయిన కుటుంబాల ప‌రామ‌ర్శ‌లో మంత్రి లోకేష్ వ్య‌వ‌హ‌రించిన తీరు వివాదానికి తెర లేపింది. మీ కుటుంబ సభ్యులు చనిపోలేదు కదా ఇక్క‌డ‌ మీకేం పని అంటూ కార్మిక సంఘ ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

S

National | Published On Jun 9, 2026, 1.27 pm IST

Nara Lokesh | విశాఖ స్టీల్ ప్ర‌మాదం.. మంత్రి లోకేష్ తీరుపై కార్మిక సంఘాల గుర్రు
Advertisement

Nara Lokesh | త్రినేత్ర‌.న్యూస్‌: నిన్న జ‌రిగిన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్ర‌మాదంలో చ‌నిపోయిన కుటుంబాల ప‌రామ‌ర్శ‌లో మంత్రి లోకేష్ వ్య‌వ‌హ‌రించిన తీరు వివాదానికి తెర లేపింది. మృతుల కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించే వేళ ఆయ‌న కార్మిక సంఘాల‌పై అస‌హ‌నం వ్యక్తం చేశారు. మీ కుటుంబ సభ్యులు చనిపోలేదు కదా ఇక్క‌డ‌ మీకేం పని అంటూ కార్మిక సంఘ ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆయ‌న తీరుపై కార్మిక సంఘాలు మండిప‌డుతున్నాయి. క‌నీస‌ మాన‌వ‌త్వం లేకుండా లోకేష్ వ్య‌వ‌హ‌రించార‌ని కార్మిక సంఘ‌ నాయ‌కులు గుర్రుమంటున్నారు.

ఈ సంద‌ర్భంగా కార్మిక సంఘ నాయ‌కులు మాట్లాడారు. మృతుల కుటుంబాలకు ఇప్పుడే ప‌రిహారం ప్రకటించాలి. లోకేష్ విశాఖపట్నం వ‌దిలి వెళ్లేలోగా ప్రెస్ మీట్ పెట్టి మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు, క్షతగాత్రుల కుటుంబాలకు 50 లక్షల రూపాయలు ప్రకటించాలి. స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. స్టీల్ ప్లాంట్‌లో భద్రత ప్రమాణాలు లోపించిన యంత్రాలను తొలగించి కొత్త వాటిని నిర్మించాలి. కార్మికుల భద్రత కోసం ప్లాంట్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. స్టీల్ ప్లాంట్ ఎండీపై కేసు నమోదు చేయాలి చేయాలి అని డిమాండ్ చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement